NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / India: బహ్రెయిన్‌లో 4 దశాబ్దాలుగా చిక్కుకున్న భారతీయుడు..ఎట్టకేలకు భారతదేశానికి..
    తదుపరి వార్తా కథనం
    India: బహ్రెయిన్‌లో 4 దశాబ్దాలుగా చిక్కుకున్న భారతీయుడు..ఎట్టకేలకు భారతదేశానికి..
    బహ్రెయిన్‌లో 4 దశాబ్దాలుగా చిక్కుకున్న భారతీయుడు..ఎట్టకేలకు భారతదేశానికి..

    India: బహ్రెయిన్‌లో 4 దశాబ్దాలుగా చిక్కుకున్న భారతీయుడు..ఎట్టకేలకు భారతదేశానికి..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2025
    11:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉద్యోగం లేదా ఉన్నత విద్య కోసం ఎంతోమంది భారతీయులు విదేశాలకు వలస వెళ్తుంటారు.

    అయితే, కొన్ని సందర్భాల్లో అక్కడి పరిస్థితుల వల్ల కొందరు ఆ దేశాల్లో చిక్కుకుపోతారు.

    ఇలాంటి ఒక సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 42 ఏళ్లుగా బహ్రెయిన్‌లో ఉన్న కేరళకు చెందిన గోపాలన్‌ చంద్రన్‌ ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చారు.

    ఈ విషయాన్ని ప్రవాసీ లీగల్‌ సెల్‌ అనే ఎన్జీవో ఒక సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించింది.

    వారి వివరాల ప్రకారం,గోపాలన్‌ చంద్రన్‌ కేరళలోని పౌడికోణం సమీపంలోని ఓ చిన్న గ్రామానికి చెందినవారు.

    1983లో ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లిన ఆయన అక్కడ యజమాని ఆకస్మికంగా మరణించడం వల్ల కష్టాల్లో పడ్డారు.

    వివరాలు 

    ప్రవాసీ లీగల్‌ సెల్‌ ఒక సమాజ సేవా సంస్థ

    ఈ పరిణామాల్లో తన పాస్‌పోర్టు కూడా కోల్పోయారు. అందువల్ల గోపాలన్‌ అక్కడే చిక్కుకుపోయారు.

    తిరిగి స్వదేశానికి వచ్చే మార్గం తెలియక, నలభై రెండు సంవత్సరాలు విదేశంలోనే గడిపారు.

    ఇటీవల ఫేస్‌ బుక్‌ ద్వారా గోపాలన్‌ తన పరిస్థితిని వివరించారు.ఒక వీడియోలో తన కుటుంబాన్ని చూసే ఆశతో బాధను వ్యక్తపరచారు.

    ఈ వీడియో ప్రవాసీ లీగల్‌ సెల్‌ దృష్టికి రావడంతో,వారు వెంటనే చర్యలు ప్రారంభించారు.

    బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి,గోపాలన్‌ను వెనక్కి తీసుకురావడంలో సహాయపడ్డారు.

    ప్రవాసీ లీగల్‌ సెల్‌ ఒక సమాజ సేవా సంస్థగా పనిచేస్తోంది.ఈ సంస్థలో మాజి న్యాయమూర్తులు, న్యాయవాదులు,జర్నలిస్టులు పనిచేస్తున్నారు.

    విదేశాల్లో అన్యాయంగా చిక్కుకుపోయిన భారతీయులను గుర్తించి, వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడం వీరి ప్రధాన లక్ష్యం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025