London: లండన్లో రోడ్డు ప్రమాదం.. భారతీయ విద్యార్థిని మృతి
సెంట్రల్ లండన్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన చేష్ఠా కొచ్చర్ దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్'ఎక్స్'వేదికగా వెల్లడించారు. ఇంతకు ముందు నీతి ఆయోగ్లో పనిచేసిన చెయిస్తా కొచర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి బిహేవియరల్ సైన్స్లో పీహెచ్డీని అభ్యసిస్తున్నారు. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(COAI)డైరెక్టర్ జనరల్,రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ SP కొచ్చర్ కుమార్తె చెయిస్తా కొచర్. మార్చి 19న ఎల్ఎస్ఈ నుంచి సైకిల్పై ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆమె భర్త ప్రశాంత్ కొంత దూరంలోనే ఉన్నారు. వెంటనే వచ్చి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే మృతి చెందారు.
పీహెచ్డీ కోసం లండన్ వెళ్లిన చేష్ఠా
ఆమె తండ్రి లెఫ్టినెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ (రిటైర్డ్) మృతదేహాన్ని తీసుకురావడానికి లండన్కు చేరుకున్నారు. గురుగ్రామ్లో ఉండే చేష్ఠా.. సెప్టెంబరులోనే పీహెచ్డీ కోసం లండన్ వెళ్లారు. అంతకముందు ఆమె దిల్లీ విశ్వవిద్యాలయం, ఆశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, షికాగో విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు. 2021-23 మధ్య నీతి ఆయోగ్లోని నేషనల్ బహేవియరల్ ఇన్సైట్స్ యూనిట్లో సీనియర్ సలహాదారుగా సేవలందించారు.