NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pak ISI Chief: భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. ISI చీఫ్ మహ్మద్ అసిమ్ మాలిక్ కు కీలక బాధ్యతలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pak ISI Chief: భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. ISI చీఫ్ మహ్మద్ అసిమ్ మాలిక్ కు కీలక బాధ్యతలు
    భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. ISI చీఫ్ మహ్మద్ అసిమ్ మాలిక్ కు కీలక బాధ్యతలు

    Pak ISI Chief: భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. ISI చీఫ్ మహ్మద్ అసిమ్ మాలిక్ కు కీలక బాధ్యతలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2025
    08:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.

    ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్‌ సైన్యంలో కీలక మార్పు చోటుచేసుకుంది.

    పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మహ్మద్‌ అసిమ్‌ మాలిక్‌ను, ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారుగా (ఎన్‌ఎస్‌ఏ) నియమించినట్టు పాక్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా నివేదికలు వెలుగులోకి తెచ్చాయి.

    2024 సెప్టెంబరులో ఐఎస్‌ఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్‌ జనరల్‌ అసిమ్‌ మాలిక్‌కు, ఇప్పుడు ఎన్‌ఎస్‌ఏగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించినట్టు ఈ కథనాలు స్పష్టం చేస్తున్నాయి.

    వివరాలు 

    భారత్‌ ఎప్పుడైనా తమపై దాడికి దిగొచ్చని..

    ఇక పహల్గాం ఉగ్రదాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతిస్పందనగా భారత్‌ పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచే విధంగా సామ, దాన, భేద, దండోపాయలను ఉపయోగిస్తోంది.

    ఈ పరిణామాలతో పాక్‌ సైన్యంలో తీవ్ర ఆందోళన నెలకొంది. భారత్‌ ఎప్పుడైనా తమపై దాడికి దిగొచ్చని, పాకిస్తాన్‌ మంత్రులు బహిరంగంగా ప్రకటిస్తున్నారు.

    ఇదే సమయంలో, ఆ దేశ సైన్యాధిపతి జనరల్‌ సయీద్‌ అసిమ్‌ మునీర్‌ ఆచూకీ కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

    భారత్‌ ప్రతీకార దాడుల భయంతో ఆయన కుటుంబంతో కలసి పరాయి దేశానికి వెళ్లిపోయినట్టు సమాచారం.

    వివరాలు 

    రెండు రోజుల వ్యవధిలో 4,500 మంది సైనికులు, 250 మంది అధికారులు

    పహల్గాం దాడికి తర్వాత పాకిస్తాన్‌ అంతటా రాజకీయ, సైనిక స్థాయిలో తీవ్ర పరిణామాలు కొనసాగుతున్నాయి.

    ఈ యుద్ధ భయాల నేపథ్యంలో, సైన్యంలో భయభ్రాంతులు మరింతగా పెరిగాయి.

    ఈ క్రమంలో, "బతికితే బలుసాకు తిని బతకవచ్చు కానీ భారత్‌తో యుద్ధం చేయలేం" అనే భావనను ప్రతిబింబించేలా రెండు రోజుల వ్యవధిలో 4,500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు.

    ఈ సందర్భంగా, అసిమ్‌ మాలిక్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలు అప్పగించడం విశేషంగా చెబుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Jr.NTR: మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ బయోపిక్‌లో నటించనున్న హీరో!  జూనియర్ ఎన్టీఆర్
    Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి మణిపూర్
    Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు  కెనడా
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా

    పాకిస్థాన్

    PCB: పీసీబీకి ఆర్థిక కష్టాలు.. ఛాంపియన్స్‌ ట్రోఫీతో కోలుకోలేని నష్టం ఐసీసీ
    #NewsBytesExplainer:పాక్‌లో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల వరుస హత్యలు, ఒక్క నిందితుడిని కూడా ఎందుకు పట్టుకోలేదు? ఉగ్రవాదులు
    Pakistan: పాకిస్థాన్ లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి అంతర్జాతీయం
    Imran Khan: పాక్ ఆర్మీ చీఫ్ పై ఆంక్షలు,ఇమ్రాన్ ఖాన్ విడుదలపై.. అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025