హమాస్ అణిచివేతకు ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ.. శవాల దిబ్బగ మారిన గాజా
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్పై అత్యవసర యుద్ధం ప్రకటించారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం అత్యవసర విధానాన్ని రూపొందించింది. గాజాలో భూలోకం నుంచి హమాస్ తుడిచిపెట్టుకుపోతుందని ధీమా వ్యక్తం చేసింది.ఈమేరకు ప్రపంచం డాయేష్ ను నాశనం చేసినట్లు మేము వారిని అణిచివేస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. గాజా స్ట్రిప్లోని దాదాపు 2.3 మిలియన్ల మంది ప్రజలకు విద్యుత్ సహా తాగునీరు లేదు.ఫలితంగా 3 లక్షల 40 వేల మంది నిరాశ్రయులయ్యారు. హమాస్ ఆవాసాలపై వందలాది దాడులు చేస్తున్న సందర్బంగా ఉగ్రవాదులు ఎక్కడికీ పారిపోలేరని ఇజ్రాయెల్ అంటోంది. మరోవైపు శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు ఈజిప్ట్ నిరాకరించింది. 1,200 మందికిపైగా మరణించిన ఇజ్రాయెల్ల ఘటనలో ఐఎస్ఐఎస్ కంటే హమాస్ ప్రమాదకరమైందని నెతన్యాహు అన్నారు.