
Israel Sponge Bomb: ఇజ్రాయల్ 'స్పాంజ్ బాంబ్'తో దాడి.. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంది. యుద్ధం ఐదో రోజులోకి ప్రవేశించింది.
ఇరుదేశాలు పరస్పరం ఒకరిపై మరొకరు తీవ్రమైన దాడులు చేస్తున్నారు. బాంబులు, క్షిపణుల వర్షం కురిపించుకుంటూ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చేస్తున్నాయి.
తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం.. ఇరాన్ ప్రయోగించిన 120కి పైగా ఉపరితలం నుండి ఉపరితలం క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశామని వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. టెహ్రాన్ గగనతలంపై తమకే అధికారం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.
Details
తారాస్థాయికి చేరిన యుద్ధం
అణు, బాలిస్టిక్ క్షిపణి ముప్పులను నిర్మూలించేందుకు తమ చర్యలు కొనసాగుతాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇజ్రాయెల్ విస్తృతమైన ఆఫెన్సివ్ ఆపరేషన్కు శ్రీకారం చుట్టింది. ఇరాన్పై తీవ్ర బాంబుల దాడులు జరిపింది.
దానికి ప్రతిగా ఇరాన్ కూడా సమాధానంగా భీకరమైన ప్రతిదాడులు చేసింది.
ఈ దాడుల్లో ఇరానియన్ క్షిపణులు ఇజ్రాయెల్ కేంద్రంలో ఉన్న భవనాలను బలంగా ఢీకొట్టాయి. ఈ నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరింది.
ఇక ఇరాన్ను ఎదుర్కొనడానికి ఇజ్రాయెల్ సరికొత్త ఆయుధాన్ని వినియోగిస్తోంది.
దీనిని 'స్పాంజ్ బాంబ్'గా పిలుస్తున్నారు. ఇది పేలుడు పదార్థాలతో కూడిన బాంబ్ కాదుగాని, ఒక ప్రత్యేక రసాయన గ్రెనేడ్ రూపంలో ఉంటుంది.
Details
ప్రవేశ ద్వారాలను మూసివేయడంలో సాయపడుతుంది
ఇది టన్నళ్లను, ప్రవేశద్వారాలను మూసివేయడంలో ఉపయోగపడుతుంది. స్పాంజ్ బాంబులు సాధారణంగా రక్షిత ప్లాస్టిక్ కంటైనర్లో నిల్వ చేయబడి ఉంటాయి.
ఇందులో రెండు వేర్వేరు రసాయన ద్రవాలను వేరు చేసే మెటల్ బ్యారియర్ ఉంటుంది. బాంబ్ యాక్టివేట్ చేసిన వెంటనే ఈ రసాయన ద్రవాలు కలిసిపోతాయి.
తద్వారా అవి గమ్యస్థానాన్ని లక్ష్యంగా చేసుకొని చెలిమెలా వ్యాపిస్తాయి. ఈ విధానంతో శత్రు మౌలిక సదుపాయాలను నిష్క్రియం చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇటువంటి పరిస్థితుల మధ్య ఇరుదేశాల మధ్య యుద్ధం ఎటు వైపు దారి తీస్తుందన్నది ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్రమైన చర్చకు కేంద్రబిందువైంది.