NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Jaishankar: బ్రెజిల్‌ వేదికగా భారత్‌-చైనా విదేశాంగ మంత్రులు భేటీ 
    తదుపరి వార్తా కథనం
    Jaishankar: బ్రెజిల్‌ వేదికగా భారత్‌-చైనా విదేశాంగ మంత్రులు భేటీ 
    బ్రెజిల్‌ వేదికగా భారత్‌-చైనా విదేశాంగ మంత్రులు భేటీ

    Jaishankar: బ్రెజిల్‌ వేదికగా భారత్‌-చైనా విదేశాంగ మంత్రులు భేటీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 19, 2024
    10:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనా, భారత విదేశాంగ మంత్రులు రియో డి జనిరోలో భేటీ అయ్యారు. జీ20 సదస్సులో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమయ్యారు.

    ఈ భేటీలో, భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ విషయంలో కొంత పురోగతి సాధించినట్టు పేర్కొన్నారు.

    ఈ పురోగతిని స్వాగతించదగ్గ పరిణామంగా అభివర్ణిస్తూ, ఇది మరిన్ని అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని జైశంకర్‌ అభిప్రాయపడ్డారు.

    ఈ సందర్భంగా, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల తదుపరి కార్యాచరణపై చర్చలు నిర్వహించామని, అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్-చైనా ప్రాముఖ్యతను ఈ సమావేశం గుర్తుచేసిందని జైశంకర్‌ వివరించారు.

    వివరాలు 

    కీలక గస్తీ ఒప్పందం

    జైశంకర్‌ సోషల్‌ మీడియా వేదికగా మాట్లాడుతూ, ''జీ20 సమ్మిట్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ విషయంలో పురోగతి సాధించాం. అంతేకాకుండా, ప్రపంచ రాజకీయ పరిణామాలపై చర్చించాం'' అని తెలిపారు.

    గతంలో 2020 జూన్‌ 15న తూర్పు లద్దాఖ్‌ గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

    ఈ ఘటనలో కర్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందగా,చైనా కూడా సైనికులను కోల్పోయింది.

    అయితే, చైనా తమ నష్టాన్ని వెల్లడించలేదు.ఈ ఉద్రిక్తతలను సమర్థవంతంగా నివారించేందుకు ఇరుదేశాలు పలు చర్యలు చేపట్టాయి.

    నాలుగేళ్లుగా కొనసాగుతున్న సమస్యలకు ముగింపు పలికేందుకు ఇటీవల కీలక గస్తీ ఒప్పందం కుదిరినట్టు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్రెజిల్
    చైనా
    సుబ్రమణ్యం జైశంకర్

    తాజా

    Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక విశాఖపట్టణం
    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్

    బ్రెజిల్

    బ్రెజిల్‌లో విధ్వంసం: అధ్యక్ష భవనం తలుపు బద్ధలుకొట్టి బోల్సొనారో మద్దతుదారులు బీభత్సం అంతర్జాతీయం
    బ్రెజిల్: బోల్సోనారో మద్దతుదారుల 'మెగా నిరసన' అట్టర్ ప్లాప్ అంతర్జాతీయం
    బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం ఇండియా
    బ్రెజిల్‌లో డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం.. పోలీస్ కాల్పుల్లో 9 మంది దుర్మరణం అంతర్జాతీయం

    చైనా

    China investments in India : భారత్​లో చైనా పెట్టుబడులను పెంచేందుకు ప్రణాళికలు భారతదేశం
    Pangong Lake: పాంగాంగ్ సరస్సు మీదుగా వాడుకలో ఉన్న చైనీస్ వంతెన  భారతదేశం
    Tesla: టెస్లా ఈ దేశంలో 1.6 మిలియన్లకు పైగా EVలను రీకాల్ చేస్తోంది  టెస్లా
    China : చైనా రద్దీ నౌకాశ్రయంలో భారీ పేలుడు.. ఎందుకు జరిగిందో తెలుసా? ప్రపంచం

    సుబ్రమణ్యం జైశంకర్

    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ పాకిస్థాన్
    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ పాకిస్థాన్
    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్ కాంగ్రెస్
    మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్ ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025