Page Loader
Japan: జపాన్‌లో భయానక హత్యల 'ట్విటర్‌ కిల్లర్‌' ఉరితీత
జపాన్‌లో భయానక హత్యల 'ట్విటర్‌ కిల్లర్‌' ఉరితీత

Japan: జపాన్‌లో భయానక హత్యల 'ట్విటర్‌ కిల్లర్‌' ఉరితీత

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 27, 2025
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

2017లో జపాన్‌లోని టోక్యో నగరంలో ఒక అపార్ట్‌మెంట్‌లో తొమ్మిది మందిని అత్యంత కర్కశంగా హత్య చేసిన తకహిరో షిరైషి అనే వ్యక్తి కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా భయంకర ఉలిక్కిపాటుతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ దారుణ చర్యల నేపథ్యంలో అతడికి "ట్విటర్ కిల్లర్" అనే పేరుతో గుర్తింపు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, అతడికి మరణదండన అమలు చేసినట్టు టోక్యో అధికారులు ప్రకటించారు. అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం,2017లో టోక్యోలోని ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఎనిమిది మంది మహిళలు, ఒక పురుషుడు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘోర ఘటన చోటుచేసుకుంది. ఈ మృతదేహాల నేపథ్యంలో ప్రారంభమైన దర్యాప్తులో,ఆ ఫ్లాట్‌కు చెందిన తకహిరో షిరైషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

ఎనిమిది మంది మహిళలు, ఒక పురుషుడి హత్య 

అతనిపై విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ నిజాలను వెలుగులోకి తీసుకువచ్చారు. తాను హత్య చేసిన వారంతా సామాజిక మాధ్యమాల్లో తమకు జీవించాలనే ఆశలేవని, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో పోస్టులు పెట్టిన వారేనని షిరైషి తెలిపాడు. ఈ సమాచారాన్ని తన ప్రయోజనానికి వాడుకొని, ట్విటర్‌ వేదికగా వారిని సంప్రదించానని, వారి ఆత్మహత్య కోరికకు తాను సహకరించానంటూ విచారణలో వెల్లడించాడు. వారు చనిపోవాలనే మానసిక స్థితిలో ఉండటంతోనే తాను ఎనిమిది మంది మహిళలు, ఒక పురుషుడిని హత్య చేశానని అతడు పేర్కొన్నాడు. అయితే, అధికార దర్యాప్తులో అతడు ఈ మహిళలపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లు తేలింది. మృతుల్లో వయసు తక్కువ వయస్సు కలిగిన యువతులు, టీనేజర్లు కూడా ఉన్నారు.

వివరాలు 

షిరైషి కి "ట్విటర్ కిల్లర్"గా పేరు 

హత్యల అనంతరం షిరైషి, శవాలను ముక్కలుగా నరికి, పీచుకీచి బాక్సుల్లో నిల్వ చేసాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ మృగాత్మక చర్యలతో సోషల్ మీడియాలో అతడిని "ట్విటర్ కిల్లర్"గా పిలవడం ప్రారంభమైంది. దీని తరువాత 2020లో న్యాయ ప్రక్రియ ముగిసిన అనంతరం షిరైషికి మరణశిక్ష విధించారు. అయితే, జపాన్ దేశంలో మరణశిక్షలను వ్యతిరేకిస్తూ విస్తృత స్థాయిలో ప్రజలు నిరసనలు చేపట్టడం వల్ల మూడు సంవత్సరాలుగా ఉరిశిక్షల అమలును అక్కడి అధికారులు నిలిపివేశారు. ఇలాంటి పరిస్థితుల్లో, మూడు సంవత్సరాల అనంతరం టోక్యో డిటెన్షన్ సెంటర్‌లో శుక్రవారం షిరైషిని ఉరితీసినట్లు అధికారులు ప్రకటించారు. ఉరిశిక్ష అమలయ్యేంతవరకూ ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచినట్టు కూడా వారు స్పష్టం చేశారు.