NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / UAE : యూఏఈ కీలక నిర్ణయం.. పాకిస్థాన్ పౌరులకు వీసాల జారీ నిలిపివేత
    తదుపరి వార్తా కథనం
    UAE : యూఏఈ కీలక నిర్ణయం.. పాకిస్థాన్ పౌరులకు వీసాల జారీ నిలిపివేత
    యూఏఈ కీలక నిర్ణయం.. పాకిస్థాన్ పౌరులకు వీసాల జారీ నిలిపివేత

    UAE : యూఏఈ కీలక నిర్ణయం.. పాకిస్థాన్ పౌరులకు వీసాల జారీ నిలిపివేత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 20, 2024
    03:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇటీవల పాకిస్థాన్ పౌరులకు వీసా జారీని నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

    ఈ చర్య కారణంగా పాక్ పౌరులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు యూఏఈ ప్రయాణం కష్టసాధ్యమైంది. యూఏఈలో పాక్ రాయబారి ఫైసల్ నియాజ్ తిర్మిజీ ఈ నిర్ణయాన్ని అంగీకరించారు.

    అయితే ఈ సమస్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

    పాక్ పౌరులు నకిలీ పత్రాలతో ప్రయాణం, వీసా నిబంధనల ఉల్లంఘన, వంటి నేరాల ఆరోపణలున్నాయని యూఏఈ అధికార వర్గాలు వెల్లడించాయి.

    ఈ క్రమంలో భద్రతా సమస్యలపై దృష్టి సారించిన యూఏఈ కేబినెట్, పాక్ పౌరులకు వీసాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయించింది.

    Details

    సోషల్ మీడియాలో పాక్ పౌరులు నిరసన

    ఇస్లామాబాద్‌లోని పాక్ రాయబారి కార్యాలయానికి ఈ నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేశారు.

    యూఏఈకి వెళ్లేందుకు పాక్ పౌరులు రిటర్న్ టికెట్లు, హోటల్ బుకింగ్స్, కనీసం 3,000 దిర్హామ్‌లు కలిగి ఉండాల్సి ఉంటుంది.

    నకిలీ డాక్యుమెంట్లు, పాస్‌పోర్ట్‌లు, అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని యూఏఈ అధికారులు చెబుతున్నారు.

    యూఏఈ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ పాక్ పౌరులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు పరిస్థితిని మరింత ప్రతికూలంగా మార్చాయి.

    నిరసనలు, రాజకీయం వంటి కార్యకలాపాల్లో పాల్గొనడం యూఏఈ చట్టాలను ఉల్లంఘించే చర్యలుగా అధికారులు పేర్కొన్నారు.

    Details

    నేరాల్లో ఎక్కువగా పాకిస్థాన్ పౌరులు

    యూఏఈలో పాకిస్థాన్ పౌరులు తక్కువ శ్రేణి పనుల్లోనే కాకుండా, మోసం, దొంగతనాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యభిచారం వంటి నేరాల్లో ఎక్కువగా పాల్గొంటున్నట్లు యూఏఈ అధికారులు ఆరోపిస్తున్నారు.

    భద్రతా కారణాలు, నేరాల నియంత్రణ, చట్టాల పట్ల యూఏఈ జీరో టాలరెన్స్ విధానాలు ఈ ఆంక్షల వెనుక ఉన్న ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    ప్రపంచం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    పాకిస్థాన్

    Violation of Pakistan: బరితెగించిన పాకిస్థాన్.. సరిహద్దులో కాల్పులు ఇండియా
    Earthquake: పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. వణికిన ఢిల్లీ-ఎన్‌సిఆర్‌  భూకంపం
    Pakistan: మేము,కాంగ్రెస్ ఒకే వైఖరితో ఉన్నాం.. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ మంత్రి  అంతర్జాతీయం
    Pakistan: పాకిస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. చిన్నారి మృతి, 25 మందికి గాయాలు  అంతర్జాతీయం

    ప్రపంచం

    Iran: ఇరాన్‌లో ఘోర బొగ్గు గని ప్రమాదం.. 30 మంది కార్మికులు మృతి ఇరాన్
    Scandinavian Airlines: విమానంలో బతికిన ఎలుక.. స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్  విమానం
    Thailand: థాయిలాండ్‌‌లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత.. 120 రోజుల్లో అమల్లోకి  థాయిలాండ్
    Paracetamol: సీడీఎస్సీఓ హెచ్చరిక.. భారతదేశంలో పారాసెటమాల్ సహా 52 మందులు నాణ్యతలో విఫలం  ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025