NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / 8 మంది మాజీ భారత నేవీ అధికారులకు మరణశిక్ష విధించిన ఖతార్ కోర్టు 
    తదుపరి వార్తా కథనం
    8 మంది మాజీ భారత నేవీ అధికారులకు మరణశిక్ష విధించిన ఖతార్ కోర్టు 

    8 మంది మాజీ భారత నేవీ అధికారులకు మరణశిక్ష విధించిన ఖతార్ కోర్టు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 26, 2023
    06:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత ఏడాది ఆగస్టులో ఖతార్ అధికారులు అరెస్టు చేసిన ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించారు.

    ఈ పరిణామంపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఖతార్ తీర్పుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

    భారత్ ఈ విషయాన్ని ఖతార్ అధికారులతో చర్చిస్తోంది. గూఢచర్యం ఆరోపణలపై ఈ 8మంది అధికారులు జైలు పాలయ్యారు.

    ఈ విషయమై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. మరణశిక్ష తీర్పుతో తాము తీవ్రంగా షాక్ అయ్యామని తెలిపింది.

    Details 

    అల్ దహ్రా కేసు ఏమిటి?

    ఈ తీర్పుకి సంబంధించి పూర్తి సమాచారం కోసం ఎదురుచూస్తున్నాము. మేము వారి కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో టచ్ లో ఉన్నామని తెలిపింది.

    ఈ కేసుకు సంబంధించి అన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నామని,అలాగే కేసుకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే ప్రత్యకంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపింది.

    ఈ కేసులో గోప్యతకు సంబంధించిన కారణాల దృష్ట్యా ప్రస్తుతం ఎక్కువగా వ్యాఖ్యానించలేమని తెలిపింది.

    8 మంది భారత ఆర్మీ అధికారులు అల్ దహ్రా లో పనిచేస్తున్నారు.ఖతర్‌ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళం అధికారి నిర్వహిస్తున్నారు.

    Details 

    జైలు శిక్ష పడిన ఎనిమిది మంది భారతీయ ఆర్మీ అధికారులు వీరే 

    ఈ 8 మందిని ఖతర్‌ అధికారులు ఆగస్టు 2022 సబ్‌మెరైన్‌ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్బంధించినట్లు తెలిసింది.

    అల్ దహ్రా కేసులో జైలు శిక్ష పడిన ఎనిమిది మంది భారతీయ ఆర్మీ అధికారులు: కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సైలర్ రగేష్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025