NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / PM Modi: రేపటి నుంచి ప్రధాని మోదీ అమెరికా పర్యటన
    తదుపరి వార్తా కథనం
    PM Modi: రేపటి నుంచి ప్రధాని మోదీ అమెరికా పర్యటన
    రేపటి నుంచి ప్రధాని మోదీ అమెరికా పర్యటన

    PM Modi: రేపటి నుంచి ప్రధాని మోదీ అమెరికా పర్యటన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 20, 2024
    03:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన శనివారం ప్రారంభమవుతుంది.

    ఈ మూడు రోజుల పర్యటనలో ఆయన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు సంబంధించిన సహకారాన్ని మెరుగుపరచడం, ఉక్రెయిన్, గాజా వివాదాల పరిష్కారాలు కనుగొనడం, అలాగే గ్లోబల్ సౌత్ సమస్యలపై దృష్టి పెట్టడం జరుగుతుంది.

    విల్మింగ్టన్, డెలావేర్‌లో జరిగే వార్షిక క్వాడ్ సమ్మిట్‌లో మోదీ పాల్గొంటారు. అలాగే, న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఫ్యూచర్ శిఖరాగ్ర సదస్సులో కూడా ఆయన ప్రసంగిస్తారు.

    టెక్నాలజీ రంగంలో ఉన్న ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తారు.

    దీంతో పాటు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు మరికొన్ని దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.

    వివరాలు 

     క్వాడ్ దేశాల నాయకులతో  ద్వైపాక్షిక చర్చలు 

    మోదీ మొదట విల్మింగ్టన్ చేరుకుని, సెప్టెంబర్ 21న క్వాడ్ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాతో పాల్గొంటారు.

    క్వాడ్ సమ్మిట్‌లో గాజా, ఉక్రెయిన్ వివాదాలు, అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతపై చర్చ జరుగుతుంది.

    మోదీ మూడు క్వాడ్ దేశాల నాయకులతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు.

    విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకారం, క్వాడ్ సమ్మిట్‌లో అనేక కొత్త కార్యక్రమాలు ప్రకటించే అవకాశం ఉంది.

    రోగులు,వారి కుటుంబాలను క్యాన్సర్ ప్రభావం నుంచి రక్షించే కొత్త ప్రణాళికను క్వాడ్ నేతలు ప్రారంభిస్తారని ఆశిస్తున్నారు.

    వివరాలు 

    శాంతి, ప్రగతి, సుస్థిరతపై క్వాడ్ సమ్మిట్ ప్రత్యేక దృష్టి

    శాంతి, ప్రగతి, సుస్థిరతపై క్వాడ్ సమ్మిట్ ప్రత్యేక దృష్టి సారించనుంది. నేతలు ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, మానవతా సహాయంపై చర్చిస్తారని ఆయన తెలిపారు.

    ఉక్రెయిన్ వివాద పరిష్కారంలో భారత్ పాత్రపై మిస్రీ మాట్లాడుతూ, ఈ అంశంపై భారత ప్రభుత్వం అనేక భాగస్వాములు, నాయకులతో చర్చలు జరుపుతుందని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    అమెరికా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    నరేంద్ర మోదీ

    President Biden: నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు.. ఆయన ఏమన్నారంటే . .? జో బైడెన్
    Narendra Modi: వచ్చే వారం ఏపీ పర్యటనకు ప్రధాని రాక..? కారణం ఇదే! ఆంధ్రప్రదేశ్
    Pm Modi: అమెరికాలో ప్రధాని మోదీ మెగా కమ్యూనిటీ ఈవెంట్ కి భారీ స్పందన  అంతర్జాతీయం
    Jan dhan yojana: జన్ ధన్ యోజనకి పదేళ్లు పూర్తి.. 53 కోట్ల ఖాతాలు.. ఇది చరిత్రాత్మకమన్న ప్రధాని  భారతదేశం

    అమెరికా

    US government: ఇంటర్నెట్ డిస్కౌంట్‌ను రద్దుకు US ప్రభుత్వ నిర్ణయం.. ఆఫ్‌లైన్‌లో మిలియన్ల మంది  ఇంటర్నెట్
    America: మొదటిసారిగా $35 ట్రిలియన్లను దాటిన అమెరికా జాతీయ రుణం  బిజినెస్
    Kamala Harris: 'వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్' X ఖాతా తొలగింపు  కమలా హారిస్‌
    Intel Lays OFF: 18వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన ఇంటెల్ వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025