NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Russia: రిక్‌ ఫార్మాట్‌ను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది: సెర్గీ లావ్రోవ్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Russia: రిక్‌ ఫార్మాట్‌ను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది: సెర్గీ లావ్రోవ్
    రిక్‌ ఫార్మాట్‌ను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది: సెర్గీ లావ్రోవ్

    Russia: రిక్‌ ఫార్మాట్‌ను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది: సెర్గీ లావ్రోవ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 30, 2025
    10:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రష్యా, భారత్‌, చైనా కలిసి ఏర్పాటు చేసుకున్న రిక్‌ (RIC) ఫార్మాట్‌ను తిరిగి చురుగ్గా కొనసాగించాలన్న ఆసక్తి తమకు ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ స్పష్టం చేశారు.

    గురువారం ఉరాల్ పర్వతాల సమీపంలోని పెర్మ్ నగరంలో భద్రత,అంతర్జాతీయ సహకారంపై జరిగిన సామాజిక-రాజకీయ సమావేశంలో లావ్రోవ్‌ప్రసంగించారు.

    ఈ సందర్భంలో భారత్‌, చైనా, రష్యాల మధ్య ఉన్న భాగస్వామ్యంపై ఆయన వ్యాఖ్యలు చేశారు.

    వివరాలు 

    మూడు దేశాల మధ్య 20కు పైగా సమావేశాలు

    లావ్రోవ్‌ మాట్లాడుతూ, ''రష్యా మాజీ ప్రధాని యెవ్‌గెని ప్రైమకోవ్‌ స్వచ్ఛందంగా తీసుకున్న ముందడుగు ఫలితంగా చాలా ఏళ్ల క్రితం రిక్‌ (Russia-India-China) ఫార్మాట్‌ ఏర్పడింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ మూడు దేశాల మధ్య 20కు పైగా సమావేశాలు జరిగాయి. ఈ చర్చలు కేవలం విదేశాంగ మంత్రిత్వ శాఖల స్థాయిలో కాకుండా, ఆర్థిక, వాణిజ్య రంగాలకు చెందిన సంస్థల ప్రధానులతో కూడినవిగా కూడా కొనసాగాయి. ప్రస్తుతం భారత్‌, చైనా మధ్య సరిహద్దు సమస్యలపై కొంత అవగాహన ఏర్పడిన నేపథ్యంలో, రిక్‌ ఫార్మాట్‌ను తిరిగి క్రియాశీలం చేయడానికి ఇదే సరైన సమయంగా అనిపిస్తోంది,'' అని అన్నారు.

    వివరాలు 

    చైనాను ఎదుర్కొనేందుకు భారత్‌ను ప్రేరేపించే దిశగా నాటో ప్రయత్నం 

    ఈ సందర్భంగా లావ్రోవ్‌ నాటో (NATO) దేశాలపై విమర్శలు గుప్పించారు.

    చైనాను ఎదుర్కొనేందుకు భారత్‌ను ప్రేరేపించే దిశగా నాటో ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

    ఇది భారత్‌-చైనా మధ్య విభేదాలను రెచ్చగొట్టే పద్ధతిగా భావించవచ్చని వ్యాఖ్యానించారు.

    ఇక గత ఏడాది రష్యాలో నిర్వహించిన బ్రిక్స్‌ (BRICS) సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే.

    ఆ సమావేశంలో తూర్పు లద్ధాఖ్‌ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడం, బలగాలను వెనక్కు తీసుకోవాలన్న విషయంలో ఇరుదేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి.

    ఈ చర్చల అనంతరం భారత్‌-చైనా మధ్య సంబంధాలు కొంతవరకూ మెరుగయ్యాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రష్యా

    తాజా

    Russia: రిక్‌ ఫార్మాట్‌ను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది: సెర్గీ లావ్రోవ్ రష్యా
    Congress Committees: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు.. కొత్తగా 5 కమిటీల ప్రకటన కాంగ్రెస్
    GHMC: నగర వాసులకు కీలక సూచనలు చేసిన బల్దియా అధికారులు.. నేటి నుంచి వాటికి నో పర్మిషన్  హైదరాబాద్
    Indians : ఈ ఏడాది అమెరికా నుంచి 1100 మంది భారతీయుల బహిష్కరణ భారతదేశం

    రష్యా

    US Bans Indian Companies: రష్యా మద్దతు ఇచ్చిన 15 భారతీయ కంపెనీలపై అమెరికా చర్యలు అమెరికా
    Russia: రష్యా రాకెట్‌లో ఇరాన్ ఉపగ్రహాలు.. విజయవంతంగా కక్ష్యలోకి  ఇరాన్
    Russia: ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌పై రష్యా క్షిపణి దాడులు ఉక్రెయిన్
    NATO: ఆహారం, ఔషధాలు నిల్వ చేయండి.. యుద్ధ భయాల నడుమ నాటో దేశాలు హెచ్చరిక ఉక్రెయిన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025