NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Maldives: మాల్దీవులలో భారత సైన్యం.. ముయిజు వాదనలను తప్పుబట్టిన మాజీ మంత్రి 
    తదుపరి వార్తా కథనం
    Maldives: మాల్దీవులలో భారత సైన్యం.. ముయిజు వాదనలను తప్పుబట్టిన మాజీ మంత్రి 
    Maldives: మాల్దీవులలో భారత సైన్యం.. ముయిజు వాదనలను తప్పుబట్టిన మాజీ మంత్రి

    Maldives: మాల్దీవులలో భారత సైన్యం.. ముయిజు వాదనలను తప్పుబట్టిన మాజీ మంత్రి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 26, 2024
    08:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ వేల మంది భారతీయ సైనిక సిబ్బంది ఉన్నారంటూ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.

    తమ దేశంలో సాయుధులైన విదేశీ సైనికులు ఎవరూ లేరని అన్నారు.100రోజుల ముయిజ్జూ పాలనలో అనేక అబద్దాలు ప్రచారం చేశారని..అందులో ఇదొకటని విరచుకుపడ్డారు.

    "వేలాది మంది భారతీయ సైనిక సిబ్బంది దేశంలోకి ప్రవేశించారని అధ్యక్షుడు ముయిజ్జు ప్రచార చేశారు.ఇదే నినాదంతో అయన ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేశారు.ఇండియాతో అటువంటి ఒప్పందాలు కుదిరినట్లు అధికారంలోకి వచ్చాక నిరూపించలేకపోతున్నారు.ప్రజల విశ్వాసం కోల్పోతామనే భయంతోనే మయిజ్జు పదే పదే అబద్ధాలు చెబుతున్నారు.దేశంలో సాయుధులైన విదేశీ సైనికులు ఎవరూ లేరు."అని MDP కి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు Xలో పోస్ట్ చేశారు.

    Details 

     మాల్దీవులలో దాదాపు 70 మంది భారత సైనికులు

    పారదర్శకత ముఖ్యమని, సత్యమే గెలవాలని ఆయన నొక్కి చెప్పారు.

    ముయిజ్జు పార్టీ మాల్దీవుల నుండి భారత దళాల తొలగింపుపై ఎన్నికల ప్రచారాన్ని కేంద్రీకరించింది. ప్రస్తుతం, మాల్దీవులలో డోర్నియర్ 228 సముద్ర గస్తీ విమానం,రెండు HAL ధృవ్ హెలికాప్టర్లతో పాటు దాదాపు 70 మంది భారత సైనికులు ఉన్నారు.

    పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండవ రోజున, ముయిజ్జు అధికారికంగా మాల్దీవుల నుండి తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

    గత డిసెంబర్‌లో, భారత ప్రభుత్వంతో చర్చల అనంతరం, భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకునేందుకు ఒక ఒప్పందం కుదిరిందని ముయిజు పేర్కొన్నారు.

    Details 

    భారత బలగాల ఉపసంహరణకు..దౌత్యపరమైన చర్చలు

    భారత బలగాల ఉపసంహరణకు సంబంధించి దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు.

    గత చర్చలలో అంగీకరించినట్లుగా, మూడు ఏవియేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకదానిలోని సైనిక సిబ్బందిని మార్చి 10, 2024 లోపు ఉపసంహరించుకుంటారని, మిగిలిన రెండు ప్లాట్‌ఫారమ్‌లలోని సైనిక సిబ్బందిని మే 10, 2024 లోపు ఉపసంహరించుకుంటారని ఆయన వివరించారు.

    ఈ నెల ప్రారంభంలో, మాల్దీవులలోని విమానయాన ప్లాట్‌ఫారమ్‌లలోని సైనిక సిబ్బందిని భారతదేశం సమర్థులైన భారతీయ సాంకేతిక సిబ్బందితో భర్తీ చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మాల్దీవులు

    తాజా

    Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా యోచన బంగ్లాదేశ్
    Trump: హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్‌ మరో పెద్ద షాక్‌.. విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం అమెరికా
    V Narayanan: గగన్‌యాన్‌కు ఇప్పటివరకు 7200 పరీక్షలు పూర్తి: ఇస్రో చీఫ్  ఇస్రో
    Ahmed Sharif Chaudhry: సింధు జలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక.. "మా నీళ్లు ఆపితే,మీ ఊపిరి ఆపుతాం"అంటూ వ్యాఖ్య పాకిస్థాన్

    మాల్దీవులు

    మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    #Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్  లక్షదీవులు
    Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు సర్కార్  నరేంద్ర మోదీ
    Lakshadweep MP: మోదీ భారత పర్యాటకంపై స్పందిస్తే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?: లక్షద్వీప్ ఎంపీ లక్షదీవులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025