
Asim Munir: భారత్పై మళ్లీ నిప్పులు చెరిగిన మునీర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ అకారణంగా రెండుసార్లు పాకిస్థాన్పై దాడులు జరిపిందని ఆరోపిస్తూ ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీకి వ్యూహాత్మక దూరదృష్టి లేదని, ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని ఆయన విమర్శించారు. మరోసారి పాకిస్థాన్పై దాడికి భారత్ యత్నిస్తే తీవ్రంగా, నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. శనివారం కరాచీలోని నేవల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. భారత్ తరఫున దుందుడుకు చర్యలు జరిగినప్పటికీ, తాము పరిపక్వంగా స్పందించామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణచివేసే స్థితిలో ఉన్న తమ దేశాన్ని భారత్ అశాంతికి దారితీసే దిశగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. శుక్రవారం కూడా మునీర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
Details
న్యూఢిల్లీ నెట్వర్క్కు అఫ్గానిస్థాన్ వేదిక
ఆర్మీ ఆఫీసర్ల కామన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో పాల్గొన్న సందర్భంగా భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. న్యూఢిల్లీ నెట్వర్క్కు అఫ్గానిస్థాన్ వేదికగా మారిందని, ఆ దేశంతో కలిసి పాక్లో దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. తమకు అఫ్గానిస్థాన్తో సత్సంబంధాలు కావాలని, అయితే ఆ దేశం భారత్ మద్దతుతో ఉన్న ఉగ్రవాదులకు వేదిక కల్పించకూడదని కోరామని తెలిపారు. ఈ వ్యాఖ్యలన్నింటికీ పునాది పహల్గాం ఉగ్రదాడితో మొదలైంది. దాడికి ముందు మునీర్ కశ్మీర్ను పాకిస్థాన్కు జీవనాడిగా పేర్కొన్నారు.
Details
ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం
ఆ వెంటనే బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు బలయ్యారు. ఈ ఘటన ద్వైపాక్షికంగా ఉద్రిక్తతలకు దారి తీసింది. దీన్ని ఫలితంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'లో పాకిస్థాన్కు చెందిన ఎనిమిది కీలక మిలిటరీ స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిలో నూర్ ఖాన్ ఎయిర్బేస్ కూడా ఉంది, ఇది పాక్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఉంది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.