NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Congo: కాంగో దేశంలో మరో కొత్త మహమ్మారి.. వైరస్ సోకిన కేవలం 48 గంటల్లోనే 50 మందికిపైగా మృతి  
    తదుపరి వార్తా కథనం
    Congo: కాంగో దేశంలో మరో కొత్త మహమ్మారి.. వైరస్ సోకిన కేవలం 48 గంటల్లోనే 50 మందికిపైగా మృతి  
    కాంగో దేశంలో మరో కొత్త మహమ్మారి.. 50 మందికిపైగా మృతి

    Congo: కాంగో దేశంలో మరో కొత్త మహమ్మారి.. వైరస్ సోకిన కేవలం 48 గంటల్లోనే 50 మందికిపైగా మృతి  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 26, 2025
    09:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన కొన్నేళ్లకే, కాంగోలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది.

    ఈ వైరస్ లక్షణాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు, ఇది కూడా కొవిడ్ లాంటి ప్రమాదకరమైనదేనని భావిస్తున్నారు.

    ముఖ్యంగా గబ్బిలాలను తిన్న పిల్లలకు ఈ వైరస్ సోకడంతో తీవ్ర జ్వరం, రక్తస్రావం వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు.

    అయితే, వైరస్ బారినపడ్డ వారు కేవలం 48 గంటల్లోనే మరణించడంతో, దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

    వివరాలు 

    కొత్త వైరస్ ప్రభావం - మరణాల సంఖ్య పెరుగుతోంది 

    ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం, ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు 53 మంది మరణించగా, 419 మందికి వైరస్ సోకినట్లు ధృవీకరించబడింది.

    బాధితులందరికీ తీవ్ర జ్వరం, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, 48 గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు.

    ఈ వైరస్ మొదట జనవరి 21న గుర్తించబడిందని, నెల రోజుల్లోనే 53 మంది మరణించడం ఆందోళనకరమైన విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

    వివరాలు 

    వైరస్ వ్యాప్తికి గబ్బిలాలే కారణమా? 

    శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం, ఈ కొత్త వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం గబ్బిలాలను తినడమే.

    కాంగోలోని బోలోకో ప్రాంతానికి చెందిన ముగ్గురు పిల్లలు గబ్బిలాన్ని వేటాడి తినగా, వారిలో తీవ్రమైన జ్వరం, రక్తస్రావం వంటి లక్షణాలు తక్షణమే కనిపించాయి.

    ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, 48 గంటల్లోనే వారు మరణించారు.

    అడవి జంతువులను ఆహారంగా వినియోగించడమే ఇలాంటి వైరస్‌లు పుట్టడానికి కారణమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

    ముఖ్యంగా, ఆఫ్రికాలో గత పదేళ్లలో ఇలాంటి మహమ్మారుల సంఖ్య 60% పెరిగిందని 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

    వివరాలు 

    తాజా కేసులు - మరింత ప్రమాదమా? 

    ఫిబ్రవరి 9న బోమాటే పట్టణంలో మరోసారి ఈ వైరస్ ప్రభావం మొదలైంది.

    13 మంది నుంచి నమూనాలను సేకరించి, కాంగో రాజధాని కిన్షాసాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్‌కు పంపారు.

    పరిశీలనలో, వీటిలో కొందరికి ఎబోలా, మార్బర్గ్ వంటి హేమరేజిక్ ఫీవర్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. అంతేకాదు, కొందరికి మలేరియా కూడా నిర్ధారించబడింది.

    ప్రపంచానికి ప్రమాదమా?

    ఈ కొత్త వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది? ఇది కేవలం కాంగోకే పరిమితమా, లేక ప్రపంచమంతటికీ ప్రమాదమా?

    ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన నిర్వహిస్తోంది. భవిష్యత్తులో ఈ మహమ్మారి గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగో

    తాజా

     Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ స్పోర్ట్స్
    CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్.. ఆపరేషన్‌ సిందూర్‌
    PBKS vs RCB: చాహల్ ఆడతాడా? బ్రార్‌కు ఛాన్స్‌ ఇస్తారా?.. తికమకలో పంజాబ్ కింగ్స్  చాహల్
    Thug Life: 'థగ్ లైఫ్' కర్ణాటకలో విడుదల కాదు..ప్రకటించిన కమల్ హాసన్  కమల్ హాసన్

    కాంగో

    DR Congo: డీఆర్‌ కాంగో జైలులో129 మంది మృతి.. 59 మందికి గాయాలు  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025