NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / China: 'మద్యం, సిగరెట్లు వద్దు': ఖర్చులు తగ్గించుకోవాలని చైనా అధికారులకు ఆదేశం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    China: 'మద్యం, సిగరెట్లు వద్దు': ఖర్చులు తగ్గించుకోవాలని చైనా అధికారులకు ఆదేశం
    'మద్యం, సిగరెట్లు వద్దు': ఖర్చులు తగ్గించుకోవాలని చైనా అధికారులకు ఆదేశం

    China: 'మద్యం, సిగరెట్లు వద్దు': ఖర్చులు తగ్గించుకోవాలని చైనా అధికారులకు ఆదేశం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 20, 2025
    01:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనాలో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేందుకు అక్కడి ప్రభుత్వం తన ప్రయత్నాలను గణనీయంగా వేగవంతం చేసింది.

    ఈ క్రమంలో, ప్రభుత్వ అధికారులు ఖర్చులను తగ్గించుకోవాలని బీజింగ్ ప్రభుత్వం కొత్త ఆదేశాలను జారీ చేసింది.

    ముఖ్యంగా అధికారుల ప్రయాణాలు, మద్యం వినియోగం, సిగరెట్లు వంటి ఖర్చులను తగ్గించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది.

    ఈ విషయాలను అక్కడి ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థలు నివేదించాయి.

    వివరాలు 

    కమ్యూనిస్టు పార్టీ నేతలకు కూడ ఆదేశాలు

    దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న దృష్ట్యా, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నాయకత్వంలోని చైనా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.

    ఈ మేరకు ప్రభుత్వ అధికారులతో పాటు కమ్యూనిస్టు పార్టీ నేతలకు కూడ సుదీర్ఘ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

    ప్రయాణాలు, మద్యం, సిగరెట్లు, భోజనం మరియు కార్యాలయాల అద్దెలపై వచ్చే వ్యయాలను తగ్గించేందుకు ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించింది.

    ప్రభుత్వ వనరుల వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

    అధిక ఖర్చులను దుబారా చర్యలుగా పేర్కొంటూ, అలాంటి వ్యవహారాలు "సిగ్గుచేటు"గా పరిగణించాలంటూ స్పష్టం చేసింది.

    వివరాలు 

    స్థానిక ప్రభుత్వాలపై అప్పుల భారం

    ఇటీవలి కాలంలో, స్థిరాస్తి విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో చైనా ప్రభుత్వం తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంటోంది.

    అదే సమయంలో, స్థానిక ప్రభుత్వాలపై అప్పుల భారం కూడా గణనీయంగా పెరిగిపోయింది.

    ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఖర్చుల ద్వారా ఆర్థిక ఒత్తిడి మరింత పెరగకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది.

    ముఖ్యంగా, స్థానిక ప్రభుత్వాల ఆర్థిక స్థితిని మెరుగుపర్చే దిశగా ముందుకెళ్తూ, అధికారులను ఖర్చుల తగ్గింపుపై కేంద్రీకరించమని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా

    తాజా

    Motivational Story: ఎదుటివారిలో తప్పులు వెతకడం మొదలు పెడితే.. ఒంటరిగా మిగిలిపోతారు! జీవనశైలి
    Tata Harrier EV: హారియర్ EV అడ్వెంచర్‌ ఫీచర్లలో బెస్ట్.. రూ.21.49 లక్షలకే సూపర్ ఎస్‌యూవీ!  టాటా మోటార్స్
    Rajasthan: ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారం! రాజస్థాన్
    Vijay: విజయ్ రాజకీయ యాత్రకు శ్రీకారం.. రెండో వారంలో ప్రజల్లోకి! విజయ్

    చైనా

    China: ట్రంప్ టారిఫ్ బెదిరింపు.. అమెరికా  వ్యవసాయోత్పత్తులపై  చైనా టార్గెట్.. గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడి  అమెరికా
    China: చైనా కీలక సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ అరెస్ట్‌..?  అంతర్జాతీయం
    India- China: భారత్-చైనా సరిహద్దు వివాదం.. ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలే మార్గం : జైశంకర్ ఇండియా
    Pig Liver: బ్రెయిన్‌ డెడ్‌ మనిషి శరీరంలో పంది కాలేయం.. చైనా వైద్యుల మరో విప్లవాత్మక ప్రయోగం!  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025