Page Loader
North Korea: ఉత్తరకొరియాలో దక్షిణ కొరియా డ్రోన్‌లు..! 
ఉత్తరకొరియాలో దక్షిణ కొరియా డ్రోన్‌లు..!

North Korea: ఉత్తరకొరియాలో దక్షిణ కొరియా డ్రోన్‌లు..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2024
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర కొరియా,దక్షిణ కొరియా మధ్య శత్రుత్వం ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన విషయం. ఈ రెండు దేశాల మధ్య విరోధం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది. ఈ నేపథ్యంలో, కిమ్ సర్కారు ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన డ్రోన్‌లు తమ భూభాగంలో కనిపించాయని తెలిపింది. ఈ విషయానికి సంబంధించి ఆ దేశ అధికారిక మీడియా ఫొటోలను విడుదల చేసింది. రాజధాని పాంగ్యాంగ్‌లో నిర్వహించిన సాధారణ సోదాల్లో దక్షిణ కొరియాకు చెందిన డ్రోన్‌లు కనుగొన్నట్లు కిమ్ సర్కారు పేర్కొంది. ఈ నెలలో మూడు సార్లు దక్షిణ కొరియా ఇలాంటి డ్రోన్‌లను ఉపయోగించి ప్రచార కరపత్రాలను వదిలినట్లు ఆరోపించింది.

వివరాలు 

ప్రతీకార దాడులు కూడా తీవ్రతరం 

అయితే , తమ భూభాగంలో కనిపించిన డ్రోన్‌లు గత నెలలో దక్షిణ కొరియా సైనిక కవాతులో కనిపించినవేనని ఉత్తర కొరియా మిలిటరీ, స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు నిర్ధారించాయి. ఇక మరోవైపు, డ్రోన్‌లను ఉపయోగించి తమ భూభాగంలో కరపత్రాలు వదలడం ఉత్తర కొరియా మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణించింది. ఒకసారి మళ్లీ తమ గగనతలంలో శత్రు దేశం డ్రోన్‌లు ఎగిరినా, సరిహద్దుల్లో నిబంధనలు ఉల్లఘించినా, దీనిని యుద్ధ ప్రకటనగా పరిగణిస్తామని హెచ్చరించింది. ప్రతీకార దాడులు కూడా తీవ్రతరం అవుతాయని వ్యాఖ్యానించింది.

వివరాలు 

కిమ్ సర్కారు రాజ్యాంగంలో సవరణలు

అలాగే, మే చివరి వారం నుంచి దక్షిణ కొరియా గగనతలంపై కిమ్ ప్రభుత్వం వేల సంఖ్యలో చెత్త బెలూన్లు పంపించింది. అనంతరం, దక్షిణ కొరియాతో తమ సరిహద్దును పూర్తిగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగా, ఇరుదేశాలను కలిపే రోడ్లు, రైల్వే మార్గాలను ఇటీవల బాంబులతో పేల్చింది. అంతేకాదు, దక్షిణ కొరియాను శత్రు దేశంగా పరిగణిస్తూ కిమ్ సర్కారు తమ రాజ్యాంగంలో సవరణలు చేసింది.