ఉత్తర కొరియా టాప్ జనరల్ తొలగింపు.. యుద్ధానికి సిద్ధం కావాలని కిమ్ జోంగ్ పిలుపు
ఉత్తర కొరియా టాప్ జనరల్ను ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ తొలగించారు. ఉత్తర కొరియా ఆర్మీ యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన పిలుపున్చిచారు. ఆయుధాల ఉత్పత్తికి, సైనిక కసరత్తుల విస్తరణకు మరిన్ని ఏర్పాటు చేయాలని కిమ్ జోంగ్ ఆదేశాలను జారీ చేశారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ సమావేశంలో కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కిమ్ గత వారం ఆయుధ కర్మాగారాలను సందర్శించిన విషయం తెలిసిందే. ఆయుధ కర్మాగారాల్లో క్షిపణి ఇంజిన్లు, ఫిరంగులు, ఇతర ఆయుధాలు తయారు చేయాలని కిమ్ ఆదేశించారు. మరోవైపు ఉక్రెయిన్లో రష్యా యుధ్ధానికి ఆర్టిలరీ షెల్స్, రాకెట్లు, క్షిపణులతో సహా ఆయుధాలను ఉత్తర కొరియా అందజేస్తోందని అమెరికా ఆరోపణలు చేసింది.
అమెరికా చేసిన ఆరోపణలను ఖండించిన రష్యా, ఉత్తర కొరియా
అమెరికా చేసిన ఆరోపణలను రష్యా, ఉత్తర కొరియా ఖండించాయి. రిపబ్లిక్ స్థాపన దినోత్సవం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 9వ తేదీన ఉత్తర కొరియా మిలీషియా పరేడేను నిర్వహించనుంది. ముఖ్యంగా అమెరికా, దక్షిణ కొరియాలు ఆగస్టు 21, 24 తేదీల మధ్య మిలిటరీ డ్రిల్లను చేపట్టనున్నాయి. ఈ మిలటరీ డ్రిల్ ఉత్తరాదిలో తన భద్రతకు ముప్పు వాటిల్లుతుందని నార్త్ కొరియా భావిస్తోంది. దీంతో ఉత్తర కొరియా అధినేత కిమ్ యుద్ధసన్నాహాలకు ప్రయత్నాలు చేస్తున్నారు.