English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌లో మా సైనికులు 11 మంది చనిపోయారు: పాక్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌లో మా సైనికులు 11 మంది చనిపోయారు: పాక్‌
    ఆపరేషన్‌ సిందూర్‌లో మా సైనికులు 11 మంది చనిపోయారు: పాక్‌

    operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌లో మా సైనికులు 11 మంది చనిపోయారు: పాక్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 13, 2025
    12:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ వల్ల తమకు తలపెట్టిన నష్టాలను పాకిస్థాన్‌ ఒక్కొక్కటిగా బయటపెడుతోంది.

    తాజాగా ఆ దేశం వెల్లడించిన వివరాల ప్రకారం,ఈ దాడుల్లో మొత్తం 11 మంది పాకిస్థాన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారు.

    అంతేకాకుండా, పాకిస్థాన్‌ వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది మరణించారని వెల్లడించింది.

    మృతుల్లో స్క్వాడ్రన్‌ లీడర్‌ ఉస్మాన్‌ యూసఫ్‌ ఉన్నట్లు కూడా పేర్కొంది.

    భారత ఆపరేషన్‌ కారణంగా 40 మంది పౌరులు మరణించారని, 121 మంది తీవ్రంగా గాయపడ్డారని పాకిస్థాన్‌ సైన్యం అధికారికంగా ప్రకటించింది.

    ఈ మేరకు పాకిస్థాన్‌ సైన్యం తరఫున డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రీలేషన్స్‌ (డీజీ ఐఎస్‌పీఆర్‌) ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

    వివరాలు 

    అహ్మద్‌ షరీఫ్‌ చౌధరీ మీడియా సమావేశం

    ఇటీవలి కాలంలో కూడా పాక్‌ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌధరీ మీడియా సమావేశం నిర్వహించారు.

    ఈ సమావేశానికి నేవీ,ఎయిర్‌ఫోర్స్‌ అధికారులతో కలిసి హాజరయ్యారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,"భారత్‌తో జరిగిన సైనిక ఎదురు దాడుల్లో పాకిస్థాన్‌ వాయుసేనకు చెందిన ఒక యుద్ధ విమానం స్వల్పంగా నష్టపోయింది,"అని చెప్పారు.అయితే, ఆ విమానం ఎంత మేరకు ధ్వంసమైందోనన్న విషయంపై స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    కూలిన యుద్ధ విమానం పాకిస్థాన్‌కు చెందిన మిరాజ్‌ జెట్‌

    ఇక భారత వాయుసేనకు చెందిన ఎయిర్‌ మార్షల్‌ ఏకే భారతి ఇటీవల మీడియా బ్రీఫింగ్‌ లో మాట్లాడుతూ, "భారత వాయుసేన పాక్‌కు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసింది,"అని స్పష్టంగా ప్రకటించారు.

    అయితే ఈ విమానాల శకలాలు పాకిస్థాన్‌ భూభాగంలోనే పడిపోయినట్లు వివరించారు.

    ఈ కూలిన యుద్ధ విమానం పాకిస్థాన్‌కు చెందిన మిరాజ్‌ జెట్‌ కావచ్చని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్': ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా పలు నగరాలకు సర్వీసులు రద్దు/నిలిపివేత భారతదేశం
    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. జైషే స్థావరం ఇలా ఉంది.. వీడియో విడుదల చేసిన బీజేపీ  భారతదేశం
    Operation Sindoor: బహవల్‌పూర్‌లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం.. వైరల్‌ అయిన ఉపగ్రహ చిత్రాలు  భారతదేశం
    Opertion Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ .. రాజస్థాన్‌లో పాకిస్థాన్ బోర్డర్‌ సీల్‌.. పంజాబ్‌లో హైఅలర్ట్‌..! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025