NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pahalgam terror attack: పహల్గాం దాడి ఎఫెక్టు.. పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pahalgam terror attack: పహల్గాం దాడి ఎఫెక్టు.. పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం
    పహల్గాం దాడి ఎఫెక్టు.. పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం

    Pahalgam terror attack: పహల్గాం దాడి ఎఫెక్టు.. పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 28, 2025
    11:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది.

    పాకిస్థాన్‌కు చెందిన పలు యూట్యూబ్‌ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించింది. పాక్‌ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా సంస్థలకు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్లపై నిషేధం విధించింది.

    ఈ జాబితాలో డాన్‌ న్యూస్‌, జియో న్యూస్‌, సామా టీవీ వంటి ప్రముఖ మీడియా ఛానళ్లతో పాటు కొంతమంది జర్నలిస్టుల ఖాతాలు కూడా ఉన్నాయి.

    మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ నిర్వహిస్తున్న ఛానల్‌ ప్రసారాలు కూడా భారత్‌లో కనిపించటం లేదు. ప్రస్తుతం ఈ ఛానళ్లను యూట్యూబ్‌లో తెరవగానే ఇందులోని కంటెంట్ అందుబాటులో లేదు.

    జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కంటెంట్‌ను నిరోధించామనే సందేశం కనిపిస్తోంది.

    Details

    పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఎక్స్ ఖాతా నిషేధం

    ఇదివరకు కూడా పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక 'ఎక్స్‌' ఖాతాను భారత్‌లో నిలిపివేసిన సంగతి తెలిసిందే.

    పాక్‌కు చెందిన ఈ యూట్యూబ్‌ ఛానళ్లపై భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్‌, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ నిషేధం అమలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

    పహల్గాం దాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో భద్రతా చర్యలు మరింత ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

    ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు స్థానిక పోలీస్‌ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు.

    Details

    దోడాలోని పలు నివాసాల్లో విస్తృతంగా తనిఖీలు

    ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చిన భద్రతా దళాలు, తాజాగా దోడాలోని పలు నివాసాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

    ఏప్రిల్‌ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

    సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా నియంత్రించేవరకు పాక్‌పై కఠిన చర్యలు కొనసాగించాలని భారత్‌ నిర్ణయించింది.

    ఇందులో భాగంగా పాక్ జాతీయులను దేశం నుంచి పంపించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం

    On the recommendations of the Ministry of Home Affairs, the Government of India has banned the 16 Pakistani YouTube channels including Dawn News, Samaa TV, Ary News, Geo News for disseminating provocative and communally sensitive content, false and misleading narratives and… pic.twitter.com/AusR1fCkvN

    — ANI (@ANI) April 28, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    పాకిస్థాన్

    తాజా

    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం

    భారతదేశం

    India:2047 నాటికి భారతదేశం $23-$35 ట్రిలియన్ల GDPతో అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుంది: బెయిన్‌ అండ్‌ కంపెనీ,నాస్‌కామ్‌ నివేదిక  బిజినెస్
    India-Pakistan: 'భారతదేశాన్ని అధిగమించి,మీ స్వంత వైఫల్యాలను సరిదిద్దుకోండి'.. పాకిస్థాన్‌ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్‌..  పాకిస్థాన్
    2026 Delimitation: వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల పెరిగే సీట్ల సంఖ్య ఇదే? ఉత్తరాది రాష్ట్రాలకే లబ్ది..  భారతదేశం
    Earthquake: భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత భూకంపం

    పాకిస్థాన్

    Baloch rebels: 214 మంది పాక్ సైనికులను హతమర్చాం.. బలూచ్ తిరుగుబాటుదారుల సంచలన ప్రకటన! ప్రపంచం
    Pakistan: బలూచిస్థాన్‌లో మిలిటరీ కాన్వాయ్‌పై బాంబు దాడి.. ఐదుగురు సైనికులు మృతి ప్రపంచం
    Pakistan: పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ పై దాడి.. షాకింగ్ వీడియో విడుదల చేసిన బలూచ్ తిరుగుబాటుదారులు  అంతర్జాతీయం
    Pakistan: బలూచిస్థాన్‌లోని క్వెట్టా విమానాశ్రయంలో కాల్పులు.. జమియాత్ నాయకుడు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ మృతి అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025