
ఇమ్రాన్ ఖాన్ పై పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. ఎవర్ని వదలబోమని హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పై పరోక్షంగా ఆ దేశ సైన్యాధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 9 హింసాకాండకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హెచ్చరించారు. దీని వెనుక ఎంతటి వారున్నా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.
asas
ఫౌజ్ కు ఎవరూ అతీతం కాదు : జనరల్ మునీర్
అయితే లాయర్ల హత్య కేసులో ఇమ్రాన్ ఖాన్ నిందితులకు సహకరించారనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు అతనిపై పలు కేసులున్నాయని తెలుస్తోంది. మరోవైపు ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ - ఇ - ఇన్సాఫ్ పై చర్యలు తీసుకోవాలని పాక్ మిలటరీ భావిస్తోంది. ఈ మేరకు బుధవారం జనరల్ అసిమ్ మునీర్ రావల్పిండిలో కమాండర్లతో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ సైన్యానికి వ్యతిరేకంగా మే 9 తిరుగుబాటును ప్రేరేపించడంలో పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పాత్ర ఉందన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్లో "ఫౌజ్" అంటే సైన్యానికి ఎవరూ అతీతం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం,పబ్లిక్ ఆస్తులపై ద్వేషంతో చేసిన రాజకీయ తిరుగుబాటుపై చట్టం ఉచ్చు బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.