NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan: సింధూ నదిపై నిర్మాణం చేపడితే ధ్వంసం చేస్తాం : పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pakistan: సింధూ నదిపై నిర్మాణం చేపడితే ధ్వంసం చేస్తాం : పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక
    సింధూ నదిపై నిర్మాణం చేపడితే ధ్వంసం చేస్తాం : పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక

    Pakistan: సింధూ నదిపై నిర్మాణం చేపడితే ధ్వంసం చేస్తాం : పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 03, 2025
    05:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు.

    ఈ నేపథ్యంలో భారత్‌ పాక్‌పై వరుసగా కఠిన చర్యలు తీసుకుంటోంది. వాటిలో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం కీలకంగా మారింది.

    ఈ చర్య పాక్‌ను తీవ్రంగా కలచివేసింది. ఇందుకు స్పందించిన పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధూ నదిపై భారత్‌ ఏదైనా నిర్మాణం చేపడితే దాన్ని ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించారు.

    ఓ స్థానిక మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. భారత్‌ చర్యలపై అగ్రెసివ్‌గా స్పందిస్తున్న ఆయన వ్యాఖ్యలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.

    ఈ క్రమంలో భారత్‌ తొలిసారిగా సింధూ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టింది.

    Details

    నీరు పారకపోతే రక్తం పారుతుంది

    ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక విభేదాల్లో ఇంత స్థాయిలో నీటి ఒప్పందంపై కేంద్రం చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి.

    పాక్‌ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

    ఇక గతంలోనూ పాక్‌ నేతలు సింధూ జలాల అంశాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి.

    'సింధూ నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందందూ ఆయన చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆ దేశ వైఖరిని బట్టబయలుచేశాయి.

    Details

    ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు

    సింధూ నదిపై తమకే హక్కులున్నాయంటూ, తమ నాగరికతకు తామే రక్షకులమంటూ పాక్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.

    ఇలా చూస్తే, పహల్గాం దాడి తరువాత భారత్‌ తీసుకుంటున్న చర్యలు పాక్‌పై దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    ప్రపంచం

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    పాకిస్థాన్

    Pakistan: ఉద్రిక్తతల వేళ కరాచీ తీరంలో క్షిపణి పరీక్షకు సిద్దమైన పాకిస్థాన్.. హై అలర్ట్‌లో ముంబయి  భారతదేశం
    Danish Kaneria:పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర లేకపోతే ప్రధాని ఎందుకు స్పందించలేదు:డానిష్ కనేరియా   క్రీడలు
    Pakistan Stock Market: భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కుదేల్.. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే భారీ నష్టాలు బిజినెస్
    Pahalgam Attack: సింధు జలాల ఒప్పందం రద్దు.. స్పందించిన పాక్‌  అంతర్జాతీయం

    ప్రపంచం

    Baloch rebels: 214 మంది పాక్ సైనికులను హతమర్చాం.. బలూచ్ తిరుగుబాటుదారుల సంచలన ప్రకటన! పాకిస్థాన్
    Ranjani Srinivasan: అమెరికా వీసా రద్దు.. రంజని శ్రీనివాసన్‌పై ఉన్న ఆరోపణలేమిటీ? అమెరికా
    US Storm: అమెరికాలో భీకర తుఫాను.. 34 మంది మృతి  అమెరికా
    Pakistan: బలూచిస్థాన్‌లో మిలిటరీ కాన్వాయ్‌పై బాంబు దాడి.. ఐదుగురు సైనికులు మృతి పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025