
Pakistan: భారత్ నిషేధం దెబ్బకు పాక్ ఎగుమతులకు బ్రేక్!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం పాకిస్థాన్ సరుకుల రవాణాపై విధించిన నిషేధం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా మే 2వ తేదీ నుంచి భారత్ ఈ నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. భారత్ ఓడరేవుల్లోకి పాక్ నుంచి లేదా పాకిస్థాన్కు వెళ్లే నౌకలు రావద్దని ఆదేశించింది. నేరుగా కాకపోయినా పరోక్షంగా ఆ దేశానికి సంబంధించిన సరుకులు రవాణా కాకుండా ప్రభుత్వం గట్టిగా అమలు చేస్తోంది. ఈ నిషేధం కారణంగా పాకిస్థాన్కు నౌకాశ్రయాలు వినియోగించడంలో తీవ్ర అంతరాయాలు ఎదురవుతున్నాయి. పెద్ద షిప్పింగ్ కంపెనీలు ఇప్పుడు పాక్ పోర్టులకు వెళ్లేందుకు మొహం చుస్తుండడం లేదు.
Details
50 రోజుల వరకు ఆలస్యం
దీని వల్ల ఇస్లామాబాద్ దిగుమతులు, ఎగుమతుల్లో కనీసం 30 నుంచి 50 రోజుల ఆలస్యం ఎదురవుతోందని కరాచీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు జావెద్ బిల్వాని పేర్కొన్నారు. ఫలితంగా వ్యాపారులు ఇప్పుడు చిన్న ఫీడర్ వెస్సల్స్పై ఆధారపడాల్సి వస్తోంది. కేవలం షిప్పింగ్ ఆలస్యం కాదు, లాజిస్టిక్స్ ఖర్చులు కూడా మించిపోయాయి. బీమా, రవాణా ఖర్చుల పెరుగుదల పరిశ్రమలను ఇరుకున పడేసింది. టెక్స్టైల్ ఎగుమతిదారుడు ఆమిర్ అజిజ్ మాట్లాడుతూ.. షిప్పింగ్ ఖర్చులు పెరగడంతో వ్యాపార నిర్వహణ మరింత సంక్లిష్టమైందన్నారు. ఇప్పటికే పాక్లో విదేశీ మారకద్రవ్య కొరతతో ముడి పదార్థాల దిగుమతులపై ప్రభుత్వం నియంత్రణలు విధించగా, ఇప్పుడు భారత్ నిషేధం వాటిని మరింత సంకుచితం చేసింది.
Details
రూ.9 కోట్లు విలువైన సరుకుల సీజ్
పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యం తక్కువ కావడం, సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉండగా, భారత్ పాక్ సరుకుల చొరబాటును అడ్డుకునేందుకు పలు ఆపరేషన్లు అమలు చేస్తోంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చేపట్టిన 'ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్' ద్వారా యూఏఈ నుంచి భారత్కు తప్పుడు డాక్యుమెంట్లతో తరలిస్తున్న పాక్ సరుకులను గుర్తించి రూ. 9 కోట్ల విలువైన 1,100 మెట్రిక్ టన్నుల సరుకులను సీజ్ చేశారు. ఈ చర్యలతో పాక్ ఆర్థిక, వ్యాపార వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతోందని డాన్ పత్రిక నివేదిక పేర్కొంది.