
Pakistan: పాక్లో కలకలం.. మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్కు మరో భారీ దెబ్బ తగిలింది. కరాచీలోని మాలిర్ జైలులో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఉద్రిక్తత చెలరేగింది.
జైలులో అంతర్గతంగా హింసాత్మక ఘటన చోటుచేసుకోగా, దాదాపు 200 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు.
నేరస్థుల గూటిగా పేరున్న మాలిర్ జైలులో ఖైదీలు పోలీసులతో తీవ్ర ఘర్షణకు దిగారు. ఈ దాడిలో జైలు ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి ఖైదీలు పెద్ద సంఖ్యలో బయటకు పారిపోయారు.
ఘటనకు సంబంధించి తీవ్ర కాల్పులు జరిగాయని సమాచారం. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో సాధారణ ప్రజలు జైలు పరిసరాలను వెంటనే ఖాళీ చేయాలని అధికార వర్గాలు ఆదేశాలు జారీ చేశాయి.
Details
ఒక పోలీస్ పరిస్థితి విషమం
ఈ ఘర్షణలో ఒక పోలీస్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇప్పటివరకు పారిపోయిన ఖైదీల్లో 20 మందిని పోలీసులు తిరిగి పట్టుకున్నారని తెలుస్తోంది.
మిగిలిన ఖైదీల కోసం భారీగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భద్రతా దృష్ట్యా జైలుకు సమీపంగా ఉన్న జాతీయ రహదారిని రెండు వైపులా తాత్కాలికంగా మూసివేశారు.
జైలు డీఐజీ హసన్ సెహ్టో మీడియాతో మాట్లాడుతూ జైలు మొత్తం సీల్ చేసినట్టు, కొంతమంది ఖైదీలు, పోలీసులు గాయపడినట్లు వెల్లడించారు.
పరిస్థితిని అదుపులోకి తేవడానికి పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు, ఎఫ్సి బలగాలు సమిష్టిగా చర్యలు చేపడుతున్నాయి.
కరాచీ మొత్తం పటిష్ట భద్రత చర్యలతో ఉలిక్కిపడుతోంది. ఈ ఘటనపై కేంద్రం ఇంకా స్పందించకపోయినా, తీవ్రంగా పరిశీలన జరుగుతోందని సమాచారం.