NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / China: చైనాలో యాగి తుపాను తిప్పలు.. సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్‌ లేక నానా తంటాలు
    తదుపరి వార్తా కథనం
    China: చైనాలో యాగి తుపాను తిప్పలు.. సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్‌ లేక నానా తంటాలు
    చైనాలో యాగి తుపాను తిప్పలు.. సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్‌ లేక నానా తంటాలు

    China: చైనాలో యాగి తుపాను తిప్పలు.. సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్‌ లేక నానా తంటాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 12, 2024
    12:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనాలో యాగి తుపాను తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు.

    విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, సెల్‌ఫోన్‌ల ఛార్జింగ్‌ లేకపోవడంతో తాత్కాలిక ఛార్జింగ్‌ పాయింట్ల వద్ద ప్రజలు క్యూ లైన్లలో నిలబడ్డారు.

    దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    హైనాన్‌ ప్రావిన్స్‌లో ఈ తుపాను కారణంగా బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిశాయి.వీటి వల్ల విద్యుత్తు సరఫరాకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది.

    సెల్‌ఫోన్‌లు ఛార్జింగ్‌ లేకపోవడం వల్ల డిజిటల్‌ చెల్లింపులు కుదరని పరిస్థితులు నెలకొన్నాయి.

    కొన్నింటిలో,ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని పరిస్థితి ఎదుర్కొన్నారు.

    ప్రభుత్వం ప్రత్యేక ఛార్జింగ్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేసిన తర్వాత,వాటి వద్ద తుపాను బాధితులు బారులు తీరారు.

    వివరాలు 

    యాగి తుపాను కారణంగా.. 197 మంది మృతి 

    ఇదిలా ఉండగా, యాగి తుపాను కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 197 మంది మృతుల సంఖ్య చేరింది.

    125 మందికి పైగా గల్లంతయ్యారని వార్తలు సూచిస్తున్నాయి. ఉత్తర వియత్నాంలోని లావో కై ప్రావిన్స్‌లోని లాంగ్‌ను కుగ్రామం వరదలకు కొట్టుకుపోయిన ఘటనలో తాజాగా ఏడు మృతదేహాలు లభించాయి.

    ఈ పరిణామంతో మృతుల సంఖ్య పెరిగింది, ఇంకా పలువురు ఆచూకీ తెలియరాలేదు.

    నిపుణులు వాతావరణంలో మార్పులు వల్ల యాగి వంటి తుపానులు బలపడుతున్నాయని చెబుతున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే.. 

    Downside of cashless society

    Hainan, China🇨🇳
    After the typhoon, the water and electricity were cut off, Chinese people desperately wanted to charge their phones.
    Because all your money is in your mobile phone. Without a mobile phone, you can’t even buy a piece of bread. https://t.co/EfluhEUilv pic.twitter.com/IYEGEnW0Tr

    — Songpinganq (@songpinganq) September 9, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా

    తాజా

    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా

    చైనా

    Arunchal Padesh Row: చైనా చర్యలు అర్థ రహితం: భారత్ భారతదేశం
    India vs China: సియాచిన్ సమీపంలో రహదారి నిర్మిస్తున్న చైనా.. శాటిలైట్ ఫొటోల్లో వెల్లడి  భారతదేశం
    China-Srilanka-Ariport: చైనాకు షాకిచ్చిన శ్రీలంక...భారత్​, రష్యాలకు డ్రాగన్ నిర్మించిన ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతలు  భారతదేశం
    India Tour Postponed-Elon Musk-China Visited: భారత పర్యటనను వాయిదా వేసి చైనాకు వెళ్లిన ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025