NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Meloni-Modi: బ్రెజిల్‌ వేదికగా మెలోనితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు 
    తదుపరి వార్తా కథనం
    Meloni-Modi: బ్రెజిల్‌ వేదికగా మెలోనితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు 
    బ్రెజిల్‌ వేదికగా మెలోనితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు

    Meloni-Modi: బ్రెజిల్‌ వేదికగా మెలోనితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 19, 2024
    10:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమయ్యారు.

    ఈ క్రమంలో, ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రత్యేకంగా చర్చలు నిర్వహించారు.

    రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతికత వంటి విభాగాల్లో పరస్పర సహకారంపై వీరు చర్చించారు.

    ఈ విషయాన్ని భారత ప్రధాని ఎక్స్ వేదికగా పంచుకుంటూ, భారత్-ఇటలీ మధ్య సఖ్యత గాఢమై, ప్రపంచ శ్రేయస్సుకు దోహదం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

    భారత ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీ మధ్య స్నేహసంబంధం ఈ చర్చల సమయంలో కూడా స్పష్టమైంది.

    వివరాలు 

    పరాగ్వే అధ్యక్షుడి స్వల్ప అస్వస్థత

    వీరి ఫొటోలు సోషల్ మీడియాలో "మెలోడీ" (మెలోనీ+మోదీ) పేరుతో పలు మార్లు ట్రెండ్ అవుతుంటాయి.

    తాజా జీ20 సదస్సు సందర్భంగా ఈ "మెలోడీ" మూమెంట్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

    జీ20 సదస్సులో పాల్గొన్న పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

    వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తి స్థాయి వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని పరాగ్వే ప్రథమ మహిళ లెటీసియా ఒకాంపోస్ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్రెజిల్
    నరేంద్ర మోదీ
    ఇటలీ

    తాజా

    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  16 మంది  మృతి  చార్మినార్

    బ్రెజిల్

    బ్రెజిల్‌లో విధ్వంసం: అధ్యక్ష భవనం తలుపు బద్ధలుకొట్టి బోల్సొనారో మద్దతుదారులు బీభత్సం అంతర్జాతీయం
    బ్రెజిల్: బోల్సోనారో మద్దతుదారుల 'మెగా నిరసన' అట్టర్ ప్లాప్ అంతర్జాతీయం
    బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం ఇండియా
    బ్రెజిల్‌లో డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం.. పోలీస్ కాల్పుల్లో 9 మంది దుర్మరణం అంతర్జాతీయం

    నరేంద్ర మోదీ

    PM-KISAN Funds:పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ మహారాష్ట్ర
    Revanth Reddy: రుణమాఫీపై మీ వ్యాఖ్యలు నిజం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి
    Maldives Flight Bookings: మాల్దీవులకు మళ్లీ ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభం మాల్దీవులు
    India- Maldives: మాల్దీవులకు మోదీ భరోసా.. 'మీకు కష్టమొస్తే.. మేమున్నాం'  మాల్దీవులు

    ఇటలీ

    ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ ఆటో మొబైల్
    ఇటలీ: ఆపి ఉంచిన వ్యాన్‌లో భారీ పేలుడు, మంటల్లో చిక్కుకున్న వాహనాలు  గ్యాస్
    ఉత్తర ఇటలీని ముంచెత్తిన వరదలు; 9మంది మృతి; ఫార్ములా వన్ రేసు రద్దు తాజా వార్తలు
    33 ఏళ్ల లవర్ కోసం రూ.900 కోట్ల వీలునామా రాసిచ్చిన మాజీ ప్రధాని ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025