NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / POK: రెండు నెలల ఆహారం నిల్వచేసుకోండి.. స్థానికులను అప్రమత్తం చేసిన పీఓకే యంత్రాంగం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    POK: రెండు నెలల ఆహారం నిల్వచేసుకోండి.. స్థానికులను అప్రమత్తం చేసిన పీఓకే యంత్రాంగం 
    రెండు నెలల ఆహారం నిల్వచేసుకోండి.. స్థానికులను అప్రమత్తం చేసిన పీఓకే యంత్రాంగం

    POK: రెండు నెలల ఆహారం నిల్వచేసుకోండి.. స్థానికులను అప్రమత్తం చేసిన పీఓకే యంత్రాంగం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 02, 2025
    05:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాంలో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    ఈ నేపథ్యంలో కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను (పీఓకే) భారత్‌ తన ఆధీనంలోకి తీసుకోవాలని అంతర్జాతీయ వేదికల నుంచి సూచనలు వస్తున్నాయి.

    ఈ తరుణంలో పీఓకేలోని ప్రజలను ఆహార నిల్వల కోసం అప్రమత్తం చేయడం అక్కడి యంత్రాంగం చేపట్టిన చర్యగా కనిపిస్తోంది.

    పీఓకేలోని 13 నియోజకవర్గాల్లో నివసించే ప్రజలు కనీసం రెండు నెలల పాటు అవసరమైన ఆహార సరుకులను నిల్వ చేసుకోవాలని తమ ప్రభుత్వం సూచించిందని,చౌధరీ అన్వర్ ఉల్ హక్ పీఓకే అసెంబ్లీలో శుక్రవారం వెల్లడించారు.

    దీనితోపాటు,అత్యవసర అవసరాలకు రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన తెలిపారు.

    వివరాలు 

    పీఓకే అభివృద్ధిపై తక్కువ ఆసక్తి 

    ఆహార సరఫరా, ఔషధాలు, ఇతర అవసరాలపై ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు ఈ నిధిని వినియోగించనున్నట్లు చెప్పారు.

    స్వాతంత్య్రం వచ్చిన కొద్దికాలానికే పాకిస్థాన్‌ పీఓకేను ఆక్రమించినప్పటికీ, ఆ ప్రాంత అభివృద్ధిపై తక్కువ ఆసక్తి చూపింది.

    పీఓకేను ఇండియాపై వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా వాడుతున్న పాక్‌ పాలకులు, ఆ ప్రాంత ప్రధానమంత్రులను ఇస్లామాబాద్‌కు మాత్రమే విధేయులుగా ఉంచుతున్నారు.

    ఫలితంగా స్థానికుల హక్కులకు రక్షణ కరవవుతోంది. పాకిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాట్లు, ఉగ్రదాడులు ఆ ప్రాంతాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో పీఓకేలో భారత అనుకూల శబ్దాలు వినిపించడం ప్రారంభమైంది.

    వివరాలు 

    పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా భారత్‌ స్వాధీనం చేసుకోవాలి: బ్రిటన్‌ ఎంపీ 

    ఇందుకోసమే ఇటీవల బ్రిటన్‌కు చెందిన భారత సంతతికి చెందిన ఎంపీ లార్డ్ మేఘనాథ్ మాట్లాడుతూ.. కశ్మీర్ వివాదానికి శాశ్వత పరిష్కారం కావాలంటే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా భారత్‌ స్వాధీనం చేసుకోవాలని సూచించారు.

    ఇది మాత్రమే అన్ని సమస్యలకు తుది పరిష్కారమని స్పష్టంచేశారు.

    ఉగ్రవాదులను దుర్భరంగా శిక్షించాల్సిన అవసరం ఉందని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత్‌ గట్టి చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

    పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి అమానుషంగా ఉందని తీవ్రంగా ఖండించారు.

    కశ్మీర్ వివాదానికి ఇది చివరి ఘట్టంగా మిగలాలని ఆకాంక్షించారు.

    ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దీటైన నిర్ణయాలు తీసుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తంచేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    పాకిస్థాన్

    PSL: ఐపీఎల్‌కు పోటీగా పీఎస్ఎల్..? సెంచరీ కొట్టిన ప్లేయర్‌కు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..! క్రికెట్
    Pakistan: భద్రతా బలగాలపై బలోచ్‌ తిరుగుబాటు.. ముగ్గురు మృతి.. 18మందికి గాయాలు ప్రపంచం
    Pakistan: 'హిందువులతో పోలిస్తే మేము భిన్నం': పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంతర్జాతీయం
    ODI World Cup 2025: ఐసీసీ ఉమెన్స్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025కి అర్హత సాధించిన పాకిస్తాన్  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025