Bangladesh: బంగ్లాలో నిరసనకారుల విధ్వసం.. షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటికి నిప్పు
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బంగబంధుగా పేరుగాంచిన షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై నిరసనకారులు దాడి చేసి, నిప్పు పెట్టారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా సామాజిక మాధ్యమం ద్వారా ప్రసంగిస్తుండగా, ఈ ఘటన జరగడం గమనార్హం.
ఆమె ప్రసంగంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అవామీ లీగ్ పార్టీకి పిలుపునిచ్చారు.
ఈ నేపధ్యంలోనే ఢాకాలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. నివాసంపై దాడికి హసీనా కూడా స్పందిస్తూ, 'వారు ఒక భవనాన్ని కూలగొట్టవచ్చు, కానీ చరిత్రను అలా చెరిపివేయలేరు. ఇది వారికి గుర్తుండాలి' అని వ్యాఖ్యానించారు.
వివరాలు
బంగబంధుగా ఖ్యాతి పొందిన షేక్ ముజిబుర్ రెహమాన్
నిరసనకారులు ఈ ఇంటిని అధికారవాదం, ఫాసిజానికి ప్రతీకగా అభివర్ణిస్తూ, 1972 రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
షేక్ ముజిబుర్ రెహమాన్, బంగబంధుగా ఖ్యాతి పొందారు. ఆయన బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని భారత సహాయంతో విజయవంతం చేశారు.
1975లో, అధికార నివాసంలో ఉండగా, సైన్యం జరిపిన దాడిలో ముజిబుర్ రెహమాన్తో పాటు అతని కుటుంబంలోని 18 మంది హత్యకు గురయ్యారు.
అయితే, ఆ సమయంలో హసీనా, ఆమె సోదరి రెహనా జర్మనీలో ఉండడంతో ప్రాణాలు దక్కాయి.
బంగ్లాదేశ్ చరిత్రలో ముజిబుర్ నివాసం ఒక చారిత్రక గుర్తుగా మారిపోయింది. అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో దీనిని మ్యూజియంగా మార్చారు.