Loading...
Nirmal Purja: ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్‌ పుర్జా మృతి
ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్‌ పుర్జా మృతి

Nirmal Purja: ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్‌ పుర్జా మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుల్లో ఒకరైన నిర్మల్‌ పుర్జా (43) మృతి చెందారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లోని బ్రాడ్‌ పీక్‌ పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో సంభవించిన భారీ హిమపాతం కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ఎలైట్‌ ఎక్స్‌పెడిషన్‌ సంస్థ ధ్రువీకరించింది. నిర్మల్‌ పుర్జా నేతృత్వంలో పర్వతారోహణకు వెళ్లిన 10 మంది సభ్యుల బృందం హిమపాతం అనంతరం గల్లంతైంది. ఇప్పటివరకు వారిలో నలుగురి మృతదేహాలను అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు.

వివరాలు

చరిత్ర సృష్టించిన పర్వతారోహకుడు

నేపాల్‌లో జన్మించిన నిర్మల్‌ పుర్జా, బ్రిటన్‌కు చెందిన గుర్ఖా బ్రిగేడ్‌లో మాజీ సభ్యుడిగా సేవలందించారు.

పర్వతారోహణపై అపారమైన ఆసక్తితో ఎన్నో సాహస యాత్రలను విజయవంతంగా పూర్తి చేశారు. 2019లో ప్రపంచంలోని 8 వేల మీటర్లకు పైగా ఎత్తున్న 14 శిఖరాలను కేవలం ఏడు నెలల్లోపే అధిరోహించి చరిత్ర సృష్టించారు.

అనంతరం 2021 శీతాకాలంలో కే2 పర్వతాన్ని అధిరోహించిన తొలి బృందంలో కూడా ఆయన సభ్యుడిగా నిలిచారు. నిర్మల్‌ పుర్జా సాహస గాథ ఆధారంగా '14 పీక్స్‌: నథింగ్‌ ఈజ్‌ ఇంపాజిబుల్‌' పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీ కూడా విడుదలైంది.

వివరాలు

బ్రాడ్‌ పీక్‌ యాత్రలో విషాదం

కారాకోరం పర్వతశ్రేణుల్లోని బ్రాడ్‌ పీక్‌ సముద్ర మట్టానికి 8,051 మీటర్ల ఎత్తులో ఉండి, ప్రపంచంలో 12వ అత్యంత ఎత్తైన పర్వతంగా గుర్తింపు పొందింది.

అత్యంత క్లిష్టమైన ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు నిర్మల్‌ పుర్జా నేతృత్వంలోని 10 మంది బృందం యాత్ర ప్రారంభించింది.

యాత్రికులు సుమారు 7 వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో భారీ హిమపాతం సంభవించడంతో అందరూ గల్లంతయ్యారు.

ఈ బృందంలో ఆరుగురు నేపాల్‌కు చెందినవారు కాగా, పాకిస్థాన్‌, ఒమన్‌, అమెరికా, చైనా దేశాలకు చెందిన ఒక్కో పర్వతారోహకుడు ఉన్నారు.

ADVERTISEMENT