NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Sudan: సుడాన్‌లో ఆర్ఎస్ఎఫ్ దాడులు.. చిన్నారులతో సహా 300కి పైగా మృతి
    తదుపరి వార్తా కథనం
    Sudan: సుడాన్‌లో ఆర్ఎస్ఎఫ్ దాడులు.. చిన్నారులతో సహా 300కి పైగా మృతి
    సుడాన్‌లో ఆర్ఎస్ఎఫ్ దాడులు.. చిన్నారులతో సహా 300కి పైగా మృతి

    Sudan: సుడాన్‌లో ఆర్ఎస్ఎఫ్ దాడులు.. చిన్నారులతో సహా 300కి పైగా మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 15, 2025
    09:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సూడాన్‌లో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. ఇటీవల ఆ దేశంలోని పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (RSF)బలగాలు జరిపిన దాడుల వల్ల భారీగా ప్రాణనష్టం సంభవించింది.

    ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల సంస్థ(OCHA)వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మృతిచెందారు.

    జామ్జామ్‌, అబూషాక్‌ శరణార్థ శిబిరాలపై గతవారం RSF బలగాలు చెలరేగిన దాడులు నిర్వహించాయి.

    ఇందులో 300 మంది పౌరుల మృతి జరిగినట్లు ప్రాథమిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. మృతులలో 10 మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ మానవతా సంస్థకు చెందిన సిబ్బందిగా గుర్తించారు.

    వీరు జామ్జామ్‌ శిబిరంలోని ఆరోగ్య కేంద్రాల్లో సేవలందిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరణించిన వారిలో 23 మంది చిన్నారులుగా స్థానిక మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

    Details

    జామ్జామ్‌ శిబిరాన్ని విడిచి వెళ్లిన పౌరులు

    ఈ దాడులను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ తీవ్రంగా ఖండించారు.

    శత్రుత్వానికి తక్షణమే ముగింపు పలకాలని, పౌరులు, మానవతా సిబ్బందికి సురక్షితమైన పరిస్థితులు కల్పించాలని కోరారు.

    దాడుల భయంతో జామ్జామ్‌ శిబిరాన్ని ఇప్పటికే 16,000 మందికి పైగా పౌరులు విడిచిపెట్టినట్లు సమాచారం.

    ఇక 2023 ఏప్రిల్‌లో ప్రారంభమైన SAF, RSF మధ్య సుదీర్ఘ పోరాటం ఇప్పటివరకు 29,600 మందికి పైగా ప్రాణాలు బలిగొంది.

    SAFఅధిపతి అబ్దుల్ ఫత్తా అల్-బుర్హాన్, ఆయన మాజీ డిప్యూటీ, RSF కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య ఏర్పడిన విభేదాలే ఈ ఘర్షణలకు నాంది పలికాయి.

    యుద్ధం కారణంగా ఇప్పటి వరకు కోటి మందికి పైగా ప్రజలు సూడాన్‌ను విడిచిపెట్టినట్లు ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సూడాన్
    ప్రపంచం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సూడాన్

    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం  భారతదేశం
    సూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్‌ఓ తాజా వార్తలు
    సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం  భారతదేశం
    ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు నౌకాదళం

    ప్రపంచం

    Road Accident: బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 37 మంది దుర్మరణం  రోడ్డు ప్రమాదం
    USA: ఉత్తర, దక్షిణ కరోలినాలో భయానక కార్చిచ్చు.. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు  అమెరికా
    Bangladesh: భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు మునుపటిలాగే బలంగా ఉన్నాయ్.. మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్
    fighter plane: యుద్ధ విమానం అదృశ్యం.. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం ఫిలిప్పీన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025