NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan: మేము,కాంగ్రెస్ ఒకే వైఖరితో ఉన్నాం.. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ మంత్రి 
    తదుపరి వార్తా కథనం
    Pakistan: మేము,కాంగ్రెస్ ఒకే వైఖరితో ఉన్నాం.. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ మంత్రి 
    మేము,కాంగ్రెస్ ఒకే వైఖరితో ఉన్నాం.. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ మంత్రి

    Pakistan: మేము,కాంగ్రెస్ ఒకే వైఖరితో ఉన్నాం.. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ మంత్రి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 19, 2024
    12:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం,భారత్‌లోని కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఒకే విధానంలో ఉన్నట్లు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ పేర్కొన్నారు.

    ఈ వ్యాఖ్యలు, జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

    జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసీఫ్ మాట్లాడుతూ, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి గెలిచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

    ఈ కూటమి, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ పునరుద్ధరణను ఎన్నికల ప్రధాన అంశంగా తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

    ఆయన ప్రకారం, ఈ విషయంలో పాకిస్తాన్, కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ దృక్పథాలు ఒకేలా ఉన్నాయని చెప్పారు.

    వివరాలు 

    ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన అంశం నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీల ప్రధాన అజెండా 

    నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్టికల్ 370 పునరుద్ధరణ గురించి మాట్లాడుతుండగా, కాంగ్రెస్ ఈ అంశంపై మౌనం పాటిస్తోంది.

    ఇది మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా, జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది.

    ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన అంశం జమ్మూ కశ్మీర్ ప్రజల భావోద్వేగానికి సంబంధించినది, ముఖ్యంగా కశ్మీర్ లోయలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు.

    ఈ అంశం, కశ్మీరీ పార్టీలు అయిన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ లాంటి పార్టీల ప్రధాన అజెండాగా మారింది.

    వివరాలు 

    61 శాతం పోలింగ్

    మరోవైపు పాక్‌ వ్యాఖ్యలపై భాజపా నాయకుడు అమిత్‌ మాలవీయా స్పందిస్తూ.. పాక్ ఉగ్రవాద దేశమని, కశ్మీర్ విషయంలో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమికి మద్దతు ఇస్తోందని విమర్శించారు.

    ఆయన అభిప్రాయం ప్రకారం, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పాకిస్తాన్ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని అన్నారు.

    ఈ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 61 శాతం పోలింగ్ నమోదయింది, ఇది గత 35 ఏళ్లలో అత్యధికం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్ రాహుల్ గాంధీ
    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి

    పాకిస్థాన్

    Pakistan election: నవాజ్ షరీఫ్‌, బిలావల్ భుట్టో మధ్య కుదిరిన ఒప్పందం.. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు  ఎన్నికలు
    Pakistan new PM: పాకిస్థాన్ కొత్త ప్రధానిగా నవాజ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్ ప్రధాన మంత్రి
    Pakistan: పాకిస్థాన్‌లో అండర్ వరల్డ్ డాన్ అమీర్ బాలాజ్ టిప్పు హతం  హత్య
    Tata Group: పాకిస్థాన్ జీడీపీని అధిగమించిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025