Sanatana Dharma Day: సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించిన అమెరికా నగరం
డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్రమైన దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదం దేశం దాటి ఖండాంతరాలకు చేరుకుంది. భారతదేశంలో సనాతన ధర్మంపై వివాదం చెలరేగుతున్న వేళ అమెరికాలోని కెంటకీలోని లూయిస్విల్లే మేయర్ సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించారు. లూయిస్విల్లేలోని హిందూ దేవాలయం కెంటకీలో జరిగిన మహా కుంభాభిషేకం వేడుకలో మేయర్ క్రెయిగ్ గ్రీన్బెర్గ్ తరపున డిప్యూటీ మేయర్ బార్బరా సెక్స్టన్ స్మిత్ ఈ ప్రకటనను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక నాయకులు చిదానంద సరస్వతి, పరమార్థ నికేతన్ అధ్యక్షుడు రిషికేశ్, శ్రీశ్రీ రవిశంకర్, భగవతీ సరస్వతి, పలువురు ఆధ్యాత్మిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.