
Iran: 400 కేజీల శుద్ధి యురేనియం రహస్య కేంద్రం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ యురేనియంను మోతాదుకు మించి శుద్ధి చేయడమే ఇజ్రాయెల్, అమెరికాకు కంటగింపుగా మారింది. ఇదే యుద్ధానికి కారణం అయ్యింది. అయితే ఇంత భారీస్థాయిలో దాడి జరిగినా, శుద్ధి చేసిన యురేనియం జాడ మాత్రం బయటకు రాలేదు. అణుబాంబు తయారీకి అవసరమైన 60-90 శాతం శుద్ధి చేసిన స్వచ్ఛయురేనియం-235ని ఇరాన్ ఉత్పత్తి చేస్తోందని అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లలో 60 శాతం శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఉన్నట్టు సమాచారం.
Details
16 ట్రక్కుల కదలికలను గుర్తించిన అమెరికా
దీనిని కొంత రకాల ఆయుధాలకూ వినియోగించవచ్చు. చిన్న కంటైనర్లలో కార్లలో కూడా రవాణా చేయగలిగే స్థితిలో ఉందని నిపుణులు అమెరికా పత్రిక ఎన్పీఆర్ ద్వారా వెల్లడించారు. ఈ పరిమాణం పది అణుబాంబులకు సరిపోతుందని పేర్కొన్నారు. అమెరికా దాడులకే ముందే శుద్ధి చేసిన యురేనియాన్ని రహస్య ప్రదేశానికి తరలించినట్టు ఇరాన్ ప్రకటించింది. ఇందులో కొంత ఫోర్డో అణుకేంద్రం నుంచే తరలించారనేది అంచనా. అమెరికాకు చెందిన మ్యాక్సర్ టెక్నాలజీస్ జూన్ 19న ఆ ప్రదేశంలో 16 ట్రక్కుల కదలికలను గుర్తించింది.
Details
యురేనియం నిల్వల్లో 60 శాతం ఉన్నట్టు గుర్తింపు
ఇస్ఫహాన్ పరిశోధన కేంద్రంలో కూడా ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో 60 శాతం ఉన్నట్టు అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నిల్వలను భూగర్భ బంకర్లో భద్రపరిచినట్టు సీఎన్ఎన్ కథనంలో పేర్కొంది. ఇటీవల జరిగిన దాడిలో నతాంజ్, ఫోర్డోపై అమెరికా 'బంకర్ బస్టర్'లను ప్రయోగించింది. కానీ ఇస్ఫహాన్పై తోమహాక్ క్షిపణులను ప్రయోగించడం వల్ల కేవలం భవనాలకే నష్టం జరిగింది. మిడిల్బరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ జెఫ్రీ లూయిస్ మాట్లాడుతూ, ''ఇస్ఫహాన్ వద్ద ఉన్న ఇరాన్ యురేనియం నిల్వలను ధ్వంసం చేయకపోతే, అమెరికా దాడులు అసంపూర్ణంగానే మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు.
Details
యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు
ఇక అమెరికా దాడులు జరిగిన ప్రదేశాల నుంచి రేడియేషన్ బయటకురాకపోవడంతో 'ఆయా ప్రదేశాల్లో నిజంగా అణుశుద్ధి పదార్థాలున్నాయా?' అనే అనుమానం రేకెత్తింది. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా 'ఇరాన్ యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. వాటిని కనుగొనే ప్రయత్నం జరుగుతోందని
Details
'ఆ రహస్య ప్రదేశం మాకు తెలుసు' - నెతన్యాహు
ఇరాన్ 60 శాతం శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఉన్న రహస్య ప్రదేశంపై ఆసక్తికర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిపారు. కానీ వివరాలు మాత్రం వెల్లడించకపోవడమే మేలని వ్యాఖ్యానించారు. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను హతమార్చిన తర్వాత ఇరాన్ అణ్వాయుధాల తయారీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందని చెప్పారు. తదుపరి నెలకు 300 బాలిస్టిక్ క్షిపణులను ఉత్పత్తి చేయాలని ఇరాన్ లక్ష్యంగా పెట్టుకుందని నెతన్యాహు తెలిపారు. ఈ విషయాన్ని తాను అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. 'ట్రంప్ అర్థం చేసుకొని అమెరికాకు మంచి జరిగే నిర్ణయమే తీసుకున్నాడని తెలిపారు. హమాస్ లొంగిపోయి, బందీలను విడుదల చేస్తే గాజాలో యుద్ధం వెంటనే ఆగిపోతుందని నెతన్యాహు చెప్పారు.