Page Loader
US: రహస్య అణ్వాయుధ ప్రణాళిక.. పాక్‌ బాలిస్టిక్‌ మిసైళ్లు సిద్ధం!
రహస్య అణ్వాయుధ ప్రణాళిక.. పాక్‌ బాలిస్టిక్‌ మిసైళ్లు సిద్ధం!

US: రహస్య అణ్వాయుధ ప్రణాళిక.. పాక్‌ బాలిస్టిక్‌ మిసైళ్లు సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 25, 2025
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను (Long-range nuclear ballistic missile) అభివృద్ధి చేస్తోందని వాషింగ్టన్‌ (US) నిఘా సంస్థలు ప్రకటించాయి. 5,500 కి.మీ.కంటే ఎక్కువదూరం ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న ఈ మిస్సైల్స్‌ పై సమాచారం వెలుగుచూసింది. అమెరికా నిఘా సంస్థలు రూపొందించిన నివేదిక ప్రకారం, ఇస్లామాబాద్‌లోని ఉగ్రసంస్థలను భారత్‌ నిర్వహించిన 'ఆపరేషన్‌ సిందూర్‌' (Operation Sindoor) తర్వాత పాకిస్థాన్‌ చైనా సహాయంతో ఆయుధ శక్తిని అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ మేరకే అమెరికా లోని పలు లక్ష్యాలను తాకగలిగే ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను (ICBM) రహస్యంగా అభివృద్ధి చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

Details

ఆ దేశాలను శత్రువులుగా పరిణిస్తున్న అమెరికా

పాకిస్థాన్‌ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను అభివృద్ధి చేయాలని లేదా కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తే, అమెరికా అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తుందని అగ్రరాజ్య అధికారులు తెలిపారు. అమెరికాకు ముప్పుగా ఉన్న లేదా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఏ దేశాన్ని అయినా శత్రువుగా ప్రకటిస్తామని అమెరికా తెలిపింది. నివేదిక ప్రకారం, ప్రస్తుతానికి రష్యా, చైనా, ఉత్తర కొరియాలను అమెరికా శత్రువులుగా పరిగణిస్తోంది. పాకిస్థాన్‌ కొంతకాలం నుంచి స్వల్ప, మధ్యస్థ శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడంపై కేంద్రీకరించింది. ప్రస్తుతానికి ఆ దేశం వద్ద ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులు (ICBM) లేవని నివేదిక స్పష్టం చేసింది.

Details

పలు అంక్షలు విధించిన అమెరికా

2022లో పాకిస్థాన్‌ 'షాహీన్-3' మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించగా, 2023లో మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి 'ఘౌరీ'ని ప్రయోగించింది. కాగా, గతేడాది పాకిస్థాన్‌ లాంగ్-రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణుల కార్యక్రమానికి అమెరికా పలు ఆంక్షలు విధించింది. నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్‌ (NDC) సహా మరో మూడు ప్రభుత్వ రక్షణ సంస్థలతో అమెరికా కంపెనీలు వ్యాపారం చేయకూడదని నిషేధించింది. పాకిస్థాన్‌ ఇటువంటి క్షిపణుల అభివృద్ధి అమెరికాకు కూడా ముప్పని అమెరికా పేర్కొంది. అయితే, అమెరికా పక్షపాతం చూపుతోందని పాకిస్థాన్‌ విమర్శించింది. 'ఆపరేషన్‌ సిందూర్‌' కొనసాగుతున్న సమయంలో కూడా భూతలం నుంచి భూతలం పైకి 450 కి.మీ. శ్రేణి ఉన్న 'అబ్దాలి' క్షిపణిని పరీక్షించినట్లు ఇస్లామాబాద్‌ వెల్లడించింది.