
Taiwan: దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తత.. నౌకలను అడ్డుకొన్న తైవాన్
ఈ వార్తాకథనం ఏంటి
తైవాన్ కోస్ట్గార్డ్ అడ్మినిస్ట్రేషన్ (CGA) శనివారం చైనా నౌకలను డాంగ్షా ద్వీపం సమీపంలో అడ్డుకొంది. ఈ నౌకల్లో ఒకటి బీజింగ్కు చెందిన కోస్ట్గార్డ్ నౌకగా, మరొకటి భారీ చేపల పడవగా ఉంది. రెండు నౌకలు డాంగ్షా ద్వీపం వద్ద కార్యకలాపాలు సాగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా తైవాన్-చైనా మధ్య దక్షిణ చైనా సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి.
Details
ఘటన వివరాలు
ఫోకస్ తైవాన్ పత్రిక ప్రకారం, గురువారం ఉదయం 6.15 గంటలకు డాంగ్షా-నాంషా వద్ద రెండు చైనా నౌకలను గుర్తించారు. ఇవి నిషేధిత ప్రదేశానికి కొంచెం దూరంలో ఉండటంతో, 2,000 టన్నుల కట్టర్ 'తైనాన్' అనే తైవాన్ షిప్ను రంగంలోకి పంపారు. దీని ప్రభావంతో బీజింగ్ కోస్ట్గార్డ్ నౌక వెనక్కి వెళ్లింది. అయితే, అదే రోజు రాత్రి, చైనా చేపలవేట నౌక నిషేధిత ప్రదేశానికి చేరింది. రెండు తైవాన్ నౌకలు అక్కడ చేరి దీన్ని అడ్డుచేసాయి, ఫలితంగా అది తిరిగి వెనక్కి వెళ్లిపోయింది.
Details
భూభాగ వివాదం
ఇప్పటికే ఫిలిప్పీన్స్, తైవాన్ తమవిగా చెప్పుకొంటున్న స్కార్బోర్గ్ షోల్ను చైనా నేషనల్ నేచర్ రిజర్వ్గా ప్రకటించింది. దీనిపై ఇరు దేశాలు తీవ్రంగా వ్యతిరేకంగా స్పందించాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, వివాదాస్పద ప్రాంతాల్లో తమ బలం చూపించుకోవడానికి చైనా ఈ చర్యలను చేపడుతోందని అంటున్నారు.