Page Loader
Trump-Modi: జూలై 8న భారత్-యూఎస్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం! 
జూలై 8న భారత్-యూఎస్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం!

Trump-Modi: జూలై 8న భారత్-యూఎస్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, భారతదేశం మధ్య త్వరలోనే ఒక భారీ వాణిజ్య ఒప్పందం కుదరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంధర్బంగా అధికారిక ప్రకటన జూలై 8న వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య పలు ముఖ్యమైన ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించిన అధికారిక సమాచారం జూలై 8న ప్రకటించనున్నారని వార్తలు చెబుతున్నాయి.

వివరాలు 

భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలకు సంబంధించి కీలక ఒప్పందాలు

అధ్యక్షుడిగా రెండోసారి పదవిని చేపట్టిన తర్వాత ట్రంప్ పలు దేశాలపై భారీగా దిగుమతి సుంకాలు విధించారు. దీంతో దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.ఈ పరిణామాల నేపథ్యంలో, ట్రంప్ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 2న కొన్ని సుంకాలపై మూడు నెలల గడువు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ గడువు జూలై 9తో ముగియనుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ గడువును మరింత పొడిగించే అవకాశమే లేదని స్పష్టంగా చెప్పారు. ఇదిలా ఉంటే, భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదరినట్లు అంచనాలు వెల్లడి అవుతున్నాయి. ఈ ఒప్పందాలకు సంబంధించి అధికారిక ప్రకటనను జూలై 8న వెలువరించే అవకాశం ఉంది.

వివరాలు 

భారత్ అదనపు దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు కోరుతోంది 

ఈ ఒప్పందాల్లో భాగంగా, భారత్ అదనపు దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు కోరుతోంది. ముఖ్యంగా వస్త్రాలు, రొయ్యలు, రత్నాలు, తోలుపై సుంకాల్లో ఉపశమనం కోరుతోంది. మరోవైపు, అమెరికా ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్, వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి కోతలు విధించాలని డిమాండ్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతమైనట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో వ్యవసాయం, ఆటోమొబైల్ పరిశ్రమ, పారిశ్రామిక రంగాలు, శ్రమాధారిత ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించబడినట్లు సమాచారం. ఈ చర్చల కోసం ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలో భారత బృందం వాషింగ్టన్ వెళ్లి, అక్కడ అమెరికా అధికారులతో ముఖ్యమైన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.