NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఇమ్రాన్ ఖాన్‌పై కేసుల విచారణకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం ఏర్పాటు
    అంతర్జాతీయం

    ఇమ్రాన్ ఖాన్‌పై కేసుల విచారణకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం ఏర్పాటు

    ఇమ్రాన్ ఖాన్‌పై కేసుల విచారణకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం ఏర్పాటు
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 24, 2023, 04:17 pm 1 నిమి చదవండి
    ఇమ్రాన్ ఖాన్‌పై కేసుల విచారణకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం ఏర్పాటు
    ఇమ్రాన్ ఖాన్‌పై కేసుల విచారణకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం ఏర్పాటు

    పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్, అతని మద్దతుదారులపై నమోదైన కేసులు విచారణకు ఉన్నత స్థాయి సంయుక్త దర్యాప్తు బృందం(జేఐటీ)ను ఏర్పాటు చేసినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ పంజాబ్ జుల్ఫికర్ హమీద్ నేృతృత్వంలో ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ), డీఐజీ హెడ్‌క్వార్టర్స్ ఇస్లామాబాద్ అవైస్ అహ్మద్‌ కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అంతర్గత మంత్రి రాణా సనావుల్లా ప్రకటించారు. తోషఖానాకు విదేశీ నిధులపై కోర్టు విచారణను అడ్డుకునేందుకు ఫిబ్రవరి 28న ఫెడరల్ జ్యుడీషియల్ కాంప్లెక్స్‌పై దాడి చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ సాయుధ ముఠాలను ఉపయోగించారని సనావుల్లా ఆరోపించారు.

    విచారణ బృందానికి 14రోజుల గడువు

    ఇమ్రాన్ ఖాన్‌పై ఉన్న కేసులను విచారించేందుకు జేఐటీ బృందానికి 14రోజుల సమయం ఇచ్చినట్లు సనావుల్లా వెల్లడించారు. ప్రధానంగా తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు ఇటీవల జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లోకి అక్రమంగా ప్రవేశించి, ప్రధాన గేటును పగలగొట్టి, కోర్టును ధ్వంసం చేశారని యన ఆరోపించారు. ఇస్లామాబాద్‌లోని రామ్నా పోలీస్ స్టేషన్‌లో, ఉగ్రవాద నిరోధక చట్టం (ఏటీఏ) సెక్షన్ 7, అదనపు నేరాల కింద ఈ విషయంలో కేసు నమోదు చేశారు. తీవ్రవాద సంబంధిత ఆరోపణల కింద ప్రత్యేక ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో హింస, విధ్వంసం సమయంలో 58 మంది పోలీసు అధికారులు గాయపడినట్లు, 12 కార్లు, 20 మోటార్ సైకిళ్లు, ఒక పోలీసు చౌకీ (చెక్‌పోస్ట్) నిప్పంటించారని పోలీసులు తెలిపారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    పాకిస్థాన్
    వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    తాజా వార్తలు

    పాకిస్థాన్

    పాకిస్థాన్: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై ఏ క్షణమైనా పంజాబ్ పోలీసుల దాడి; ఉగ్రవాదులే టార్గెట్ పంజాబ్
    విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ ప్రధాన మంత్రి
    నన్ను పదేళ్లపాటు జైలులో పెట్టేందుకు ఆర్మీ కుట్ర: ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన ఆరోపణలు  తాజా వార్తలు
    పాకిస్థాన్‌లో ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉంది : పీసీబీ ఛీఫ్  టీమిండియా

    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    న్యూరాలింక్: మనిషి మెదడులో చిప్ అమర్చే మానవ పరీక్షకు ఎఫ్‌డీఏ అనుమతి: మస్క్ ట్వీట్ ఎలోన్ మస్క్
    చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఉద్ధృతి; వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం చైనా
    ఆకాశహర్మ్యాల బరువు కారణంగా మునిగిపోతున్న న్యూయార్క్ నగరం  న్యూయార్క్
    ఒక్కరోజులో 11బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు ఆర్నాల్ట్  ప్రపంచం

    తాజా వార్తలు

    అసోంలోని సోనిత్‌పూర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం అస్సాం/అసోం
    మణిపూర్‌లో 40మంది మిలిటెంట్లు హతం: సీఎం బీరెన్ సింగ్  మణిపూర్
    కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు  దిల్లీ
    కొత్త పార్లమెంట్‌ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం దిల్లీ

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023