Hormuz: భారత్కు ఊరట.. హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన మూడు భారత ఆయిల్ ట్యాంకర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడానికి ముందే మూడు భారత జెండా కలిగిన ముడి చమురు ట్యాంకర్లు సురక్షితంగా దాటాయి. ఈ మూడు ట్యాంకర్లలో 8.6 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ముడి చమురు ఉండగా, 94 మంది భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. దేశ్ వైభవ్, దేశ్ విభోర్, సన్మార్ హెరాల్డ్ పేర్లతో ఉన్న ఈ మూడు ట్యాంకర్లు జూన్ 24 నుంచి జూలై 1 మధ్య భారత్కు చేరుకోనున్నాయి.
వివరాలు
వడినార్ పోర్టుకు ట్యాంకర్లు..
భారత్ వైపు ప్రయాణిస్తున్న ఈ ట్యాంకర్లలో దేశ్ వైభవ్ జూన్ 24న గుజరాత్లోని వడినార్ పోర్టుకు చేరుకోనుంది. అదే రోజు దేశ్ విభోర్ సిక్కా పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది. శనివారం హోర్ముజ్ జలసంధిని దాటిన మూడో భారత ట్యాంకర్ సన్మార్ హెరాల్డ్ జూలై 1న ఒడిశాలోని పరదీప్ పోర్టుకు చేరుకోనుంది. "దేశ్ వైభవ్, దేశ్ విభోర్, సన్మార్ హెరాల్డ్ అనే మూడు భారత జెండా కలిగిన ముడి చమురు ట్యాంకర్లు 8.6 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సరుకు, 94 మంది భారతీయ సిబ్బందితో ఈ రోజు విజయవంతంగా హోర్ముజ్ జలసంధిని దాటి భారత్కు వస్తున్నాయి" అని మంత్రి సోనోవాల్ శనివారం ఎక్స్లో చేసిన పోస్టులో తెలిపారు.
వివరాలు
భారత ట్యాంకర్లు సురక్షితం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత సముద్ర ప్రయోజనాల రక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత నావికుల భద్రతతో పాటు దేశ ఇంధన సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా తమ శాఖ అన్ని సంబంధిత సంస్థలతో సమన్వయం చేస్తోందని చెప్పారు. ఇరాన్ మరోసారి హోర్ముజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో భారత ట్యాంకర్లు ముందుగానే సురక్షితంగా దాటడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, సహజ వాయువు రవాణాకు కీలక మార్గంగా ఉన్న ఈ జలసంధి, ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించిన తర్వాత కొంతకాలం తెరిచి ఉంచబడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్..
Safe passage secured!
— Sarbananda Sonowal (@sarbanandsonwal) June 20, 2026
3 Indian-flagged crude oil tankers, Desh Vaibhav, Desh Vibhor and Sanmar Herald carrying over 8.6 Lakh MT of cargo with 94 Indian crew members have successfully transited the Strait of Hormuz today and are en route to India.
Under the decisive leadership…