NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం 
    తదుపరి వార్తా కథనం
    లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం 
    లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం

    లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం 

    వ్రాసిన వారు Stalin
    May 25, 2023
    06:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లండన్‌లో నిర్వహించిన వేలంపాటలో 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ కత్తి భారీ ధరను పలికింది.

    లండన్‌లోని ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ అనే వేలం సంస్థ 'బోన్‌హామ్స్' నిర్వహించిన వేలం పాటలో రూ.143 కోట్లకు విక్రయించారు.

    ఒక భారతీయ, ఇస్లామిక్ వస్తువుకు ఇంత ధర పలకడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. టిప్పు సుల్తాన్ స్వయంగా వినియోగించిన కత్తి కారణంగా దీని అనూహ్య ధర పలికినట్లు బోన్‌హామ్స్ సంస్థ తెలిపింది.

    టిప్పు సుల్తాన్ నిద్రపోయేటప్పుడు తన పడక దగ్గరే ఈ ఖడ్గాన్ని పెట్టుకునేవారని బోన్‌హామ్స్ చెప్పింది. అప్పట్లో దీన్ని జర్మన్ బ్లేడ్ డిజైన్‌ని ఉపయోగించి తయారు చేయడంతో ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా ఉంది.

    లండన్

    టిప్పు సుల్తాన్‌ వీరత్వానికి గుర్తుగా ఖడ్గాన్ని భద్రపర్చిన బ్రిటిషర్లు

    టిప్పు సుల్తాన్‌ ఆయుధగారాల్లోని అద్భుతమైన ఖడ్గాల్లో ఇది ఒకటని బోన్‌హామ్స్ నిర్వాహకుడు ఒలివర్ వైట్ చెప్పారు.

    ఈ ఖడ్గానికి అసాధారణమైన చరిత్ర ఉందని, ఎంతో ప్రావీణ్యంతో దీన్ని తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు.

    టిప్పు సుల్తాన్‌ నిద్రిస్తున్న సమయంలో తన పడక దగ్గరే ఈ కత్తిని పెట్టుకునేవారని వివరించారు. దాన్ని మొఘల్ ఖడ్గకారులు తయారు చేశారు.

    టిప్పు సుల్తాన్‌ను చంపిన తర్వాత, అతని ఖడ్గాన్ని బ్రిటీష్ మేజర్ జనరల్ డేవిడ్ బైర్డ్‌కు అతని వీరత్వానికి చిహ్నంగా భద్రపర్చినట్లు వేలం సంస్థ తెలిపింది.

    టిప్పు సుల్తాన్ 1782లో తన తండ్రి తర్వాత దక్షిణ భారతదేశంలోని మైసూర్ రాజ్యానికి పాలకుడిగా నియమితుడయ్యాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్రిటన్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Bharti Airtel: ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ ఆఫర్‌ ఎయిర్ టెల్
    Geeta Samota: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా CISF అధికారిణి గీతా సమోటా రాజస్థాన్
    AI tutors: విద్యా రంగంలో విప్లవం.. భవిష్యత్తు బోధనలో ఏఐ ట్యూటర్లే ప్రధాన పాత్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్‌ మెసేజ్‌..చూస్తే గూస్ బంప్స్ ఖాయం ఆపరేషన్‌ సిందూర్‌

    బ్రిటన్

    ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశం నరేంద్ర మోదీ
    సీటుబెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు జరిమానా అంతర్జాతీయం
    నన్ను చంపుతానని పుతిన్ బెదిరించారు: బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్
    ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు ఆస్ట్రేలియా

    తాజా వార్తలు

    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్
     దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి కరోనా కొత్త కేసులు
    నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి ఆర్ బి ఐ
    ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే ఆస్ట్రేలియా

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా? బీజేపీ
    మహారాష్ట్ర: అకోలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ; 144 సెక్షన్ విధింపు మహారాష్ట్ర
    జమ్ముకశ్మీర్: టెర్రర్ ఫండింగ్ కేసులో పుల్వామా, షోపియాన్‌‌లో ఎన్‌ఐఏ దాడులు  జమ్ముకశ్మీర్
    మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు  తుపాను
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025