Donald Trump: అమెరికా సైనికులకు ట్రంప్ బంపర్ ఆఫర్.. క్రిస్మస్ కానుకగా 'వారియర్ డివిడెండ్'
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనికులకు భారీ క్రిస్మస్ కానుక ప్రకటించారు. 'వారియర్ డివిడెండ్' అని పిలువబడే ప్రత్యేక నగదు చెల్లింపులు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రకారం సుమారు 14.5 లక్షల మంది సైనికులు ఒక్కొక్కరికి 1,776 డాలర్లు (దాదాపు రూ. 1.60 లక్షల వరకు) పొందబోతున్నారు. దేశానికి సైనికులు చేస్తున్న సేవలు, త్యాగాలను గుర్తించడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం జాతీయ ప్రసంగంలో ట్రంప్, అమెరికా స్వాతంత్ర్య సంవత్సరమైన 1776కు అనుగుణంగా ఈ మొత్తం నిర్ణయించామని తెలిపారు. "విదేశీ ఉత్పత్తులపై విధించిన కస్టమ్స్,ఇటీవల ఆమోదం పొందిన బిల్లుల ద్వారా ప్రభుత్వం భారీ ఆదాయం పొందింది. ఆ
వివరాలు
క్రిస్మస్ లోపు'వారియర్ డివిడెండ్'
డబ్బును ఉపయోగించి మా సైనికులకు క్రిస్మస్ లోపు'వారియర్ డివిడెండ్'ఇవ్వడం జరుగుతోంది. ఈ డబ్బుకు మన సైనికులకంటే ఎక్కువ అర్హత కలిగినవారు మరొకరు లేరు" అని ఆయన పేర్కొన్నారు. చెక్కులు పంపే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనదని కూడా చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 30నాటికి యాక్టివ్ డ్యూటీలో ఉన్న సైనికులు, అధికారులు మాత్రమే ఈ'వారియర్ డివిడెండ్'కు అర్హులని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. ఇటీవల ద్రవ్యోల్బణం, ఆర్థిక నిర్వహణపై విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్, ప్రజాదరణను పెంచుకునే వ్యూహంలో భాగంగా ఈ ప్రకటన చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. తన ప్రసంగంలో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు,హౌసింగ్ సంస్కరణల గురించి కూడా ప్రస్తావించారు. సుంకాల విధానాన్ని గట్టిగా సమర్థిస్తూ,ఆ విధానం తనకు ఎంతో ఇష్టమని ఆయన అన్నారు.