
Donald Trump: షికాగో మేయర్, ఇల్లినోయా గవర్నర్ పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. షికాగో మేయర్ బ్రాండన్ జాన్సన్, ఇల్లినాయి రాష్ట్ర గవర్నర్ జేబీ ఫ్రిట్కర్ లపై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారులకు సరైన రక్షణ కల్పించడంలో ఈ ఇద్దరు నేతలు పూర్తిగా విఫలమయ్యారని ట్రంప్ విమర్శించారు. "వారిని జైలులో పెట్టాలి... దేశ భద్రతను తాము ప్రమాదంలోకి నెట్టారు," అని ఆయన తన 'ట్రూత్ సోషల్' వేదికలో పోస్ట్ చేశారు.
వివరాలు
జాతీయ భద్రతా దళాల మోహరింపు
ఇటీవలి కాలంలో ట్రంప్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జాతీయ భద్రతా దళాలను మోహరించడానికి నిర్ణయించింది. అక్రమ వలసదారులపై దాడులు, తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నారు. షికాగోలో ఇమ్మిగ్రేషన్ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు నిరసనలు తెలుపుతుండటంతో, కేంద్ర బలగాలను అక్కడికి పంపించారు. గవర్నర్ ఫ్రిట్కర్ ప్రతిస్పందన ఈ పరిణామాలపై ఇల్లినాయి గవర్నర్ జేబీ ఫ్రిట్కర్ తీవ్రంగా స్పందించారు. "డెమోక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో జాతీయ భద్రతా దళాలను మోహరించడం పూర్తిగా అన్యాయం, ప్రజాస్వామ్య విరుద్ధం," అని ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
పలు నగరాల్లో కేంద్ర బలగాల నియామకం
తన రెండో పదవీకాలం ప్రారంభమైన తరువాత, ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోని పలు ప్రధాన నగరాలకు కేంద్ర భద్రతా బలగాలను పంపించింది. వీటిలో బాల్టిమోర్, మెంఫిస్, వాషింగ్టన్ డీసీ, న్యూ ఆర్లీన్స్, ఓక్లాండ్, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్, షికాగో ప్రధాన నగరాలుగా ఉన్నాయి. పోర్ట్లాండ్ కేసుపై కోర్టు తీర్పు అయితే, పోర్ట్లాండ్ నగరానికి బలగాలను పంపాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు నిలిపివేసింది. చిన్న స్థాయి ఆందోళనలను కారణంగా చూపి కేంద్ర దళాలను మోహరించడం "సరైన చర్య కాదు" అని కోర్టు వ్యాఖ్యానించింది.