LOADING...
Donald trump: 'దశాబ్దాలుగా నాపై అసత్య ప్రచారం'.. న్యూయార్క్‌ టైమ్స్‌పై ట్రంప్ దావా 
'దశాబ్దాలుగా నాపై అసత్య ప్రచారం'.. న్యూయార్క్‌ టైమ్స్‌పై ట్రంప్ దావా

Donald trump: 'దశాబ్దాలుగా నాపై అసత్య ప్రచారం'.. న్యూయార్క్‌ టైమ్స్‌పై ట్రంప్ దావా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2025
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ న్యూయార్క్‌ టైమ్స్‌పై తీవ్ర విమర్శలు చేసారు. కొన్ని దశాబ్దాలుగా ఈ పత్రిక తన కుటుంబం, వ్యాపారాలను వ్యతిరేకంగా చూపిస్తూ అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ఇటీవల, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తన సంబంధాలపై పత్రికలో వరుస కథనాలు వెలువడిన నేపథ్యంలో ఫ్లోరిడాలో రూ.1.32 లక్షల కోట్ల (సుమారు 15 బిలియన్ డాలర్లు) నష్టం, దూషణలకు సంబంధించిన దావా వేయబోతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఇవాళ న్యూయార్క్ టైమ్స్‌పై చట్టవిరుద్ధ ప్రచారానికి గొప్ప అవకాశం లభించింది.

Details

 గ్రేట్ స్టేట్ ఆఫ్ ఫ్లోరిడాలో  దావా వేస్తున్నాం

మన దేశ చరిత్రలో అత్యంత దిగజారుడు వార్తాపత్రికలలో ఇది ఒకటి. రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ పార్టీకి వర్చువల్ మౌత్ పీస్‌గా మారింది. ఇది దశాబ్దాలుగా నాపై అబద్ధాలు, నిందలు, పరువు తీయడానికి ఉపయోగపడింది. ఇకపై అలా కుదరదని ట్రంప్ చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ దశాబ్దాలుగా నాపై అసత్య ప్రచారం చేస్తోంది. దీర్ఘకాలిక దురుద్దేశ నమూనాను ఆచరిస్తోంది. ఇది ఆమోదయోగ్యం కాదు. గ్రేట్ స్టేట్ ఆఫ్ ఫ్లోరిడాలో ఈ దావా వేస్తున్నాను. అమెరికాను మరోసారి గొప్పగా మార్చుద్దామని ట్రంప్ పోస్టు చేశారు.

Details

 ఎప్‌స్టీన్‌ కుంభకోణం నేపథ్యంలో కేసులు 

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ పేద, మధ్యతరగతి బాలికలు, యువతులను ఫ్లోరిడా, న్యూయార్క్‌, వర్జిన్‌ ఐలాండ్స్‌, మెక్సికోలోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడినట్లు ప్రధాన ఆరోపణలున్నాయి. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి, మరొక యువతిని ఆ బంగ్లాకు తేవడానికి మరో కమీషన్ ఇచ్చేవాడని ఆరోపణలు. ఈ చీకటి వ్యవహారం రెండు దశాబ్దాలపాటు కొనసాగింది. 2005లో మొదటి అరెస్టు జరిగింది, ఎప్‌స్టీన్‌ను కొన్ని నెలలు జైల్లో ఉంచారు. 2019లో 'మీ టూ' ఉద్యమ సమయంలో మరోసారి ఆరోపణలు వచ్చి, ఆగస్టులో ఆయన మరణించాడు. అతడిని పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. ఎప్‌స్టీన్‌ మాజీ సహచరురాలు మాక్‌స్వెల్‌కు ఇప్పటికే 20 ఏళ్ల జైలుశిక్ష విధించబడింది. ఈ నేపథ్యంతో ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌ సంబంధాలపై అమెరికా పత్రికల్లో పలు కథనాలు ప్రచురించారు.