NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Donald Trump: 'భారత్‌ కొన్ని అంశాల్లో సిద్ధంగా ఉండాలి'.. వెల్లడించిన ట్రంప్‌ మాజీ సహాయకురాలు
    తదుపరి వార్తా కథనం
    Donald Trump: 'భారత్‌ కొన్ని అంశాల్లో సిద్ధంగా ఉండాలి'.. వెల్లడించిన ట్రంప్‌ మాజీ సహాయకురాలు
    'భారత్‌ కొన్ని అంశాల్లో సిద్ధంగా ఉండాలి'.. వెల్లడించిన ట్రంప్‌ మాజీ సహాయకురాలు

    Donald Trump: 'భారత్‌ కొన్ని అంశాల్లో సిద్ధంగా ఉండాలి'.. వెల్లడించిన ట్రంప్‌ మాజీ సహాయకురాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 15, 2024
    12:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన రెండోసారి పాలనలో కూడా భారత్‌ విషయంలో పెద్ద మార్పు చూపించరని ఆయన పూర్వ సహాయకురాలు లీసా కర్టిస్‌ అన్నారు.

    2017-21 మధ్య ఆమె ట్రంప్‌ పాలనలో అమెరికా అధ్యక్షుడి డిప్యూటీ సహాయకురాలిగా, దక్షిణ-మధ్య ఆసియా ఎన్‌ఎస్‌ఏ సీనియర్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

    ట్రంప్‌ తన మొదటి పదవిలో అసంపూర్ణంగా ముగించిన అంశాల నుంచి ఈసారి రెండో విడత ప్రారంభిస్తారని లీసా పేర్కొన్నారు.

    ఈ అంశాల్లో సుంకాలు, రష్యా నుంచి ఆయుధాల కొనుగోల్లు, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు ప్రధానమైనవి. "ఆయన అసంపూర్తిగా వదిలి వెళ్ళిన అంశాలను ఈసారి కొనసాగిస్తారని నేను భావిస్తున్నాను," అని ఆమె అన్నారు.

    వివరాలు 

    భారత్‌-అమెరికా సంబంధాలు

    లీసా కర్టిస్‌ ట్రంప్‌ రెండో పదవిలో భారత్‌కు సంబంధించి సానుకూల దృక్పథం ఉంచాలని ఆశిస్తున్నారు.

    "ట్రంప్‌ భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలను సృష్టిస్తారు," అని ఆమె చెప్పారు.

    ట్రంప్‌ తొలి పదవిలో భారత్‌-అమెరికా సంబంధాలు బలపడ్డాయి, ముఖ్యంగా చైనా నుంచి పొంచు ఉన్న ముప్పు కారణంగా. "మోదీ హూస్టన్‌లో 50,000 మందిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. అలాగే, ట్రంప్‌ అహ్మదాబాద్‌లో 1,00,000 మందితో ప్రసంగించారు. ఈ ఆహ్వానాల ద్వారానే మిత్రత్వం మరింత పటిష్టం అయ్యింది," అని లీసా పేర్కొన్నారు.

    వివరాలు 

    సైనిక సాంకేతికత

    భారత్‌ సైనిక సాంకేతికత విషయంలో చాలా పురోగతి సాధించింది.

    "ఆయన ప్రభుత్వంలో భారత్‌కు సాయుధ డ్రోన్ల టెక్నాలజీ వచ్చింది.ఇప్పుడు 31 'సీగార్డియన్ ప్రిడేటర్'డ్రోన్లను కొనుగోలు చేస్తున్నారు,"అని ఆమె అన్నారు.

    ట్రంప్‌ పాలనలో కొంత ఇబ్బంది:

    "ట్రంప్‌ పాలనలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.ట్రంప్‌ టాక్స్ పై ట్వీట్‌ చేసినప్పుడు సమస్యలు మొదలయ్యాయి," అని లీసా అన్నారు.

    ట్రంప్‌ ఇతర దేశాల నుంచి అమెరికా కంపెనీలకు మరింత అవకాశాలు కావాలని కోరుకుంటారు.

    ఆయన విధానం ప్రకారం,ప్రతి భేటీకి ముందు ట్వీట్స్ చేస్తారు, ఇది బేరసారాలను సంబంధించి కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చింది.

    భారత్‌-అమెరికా బంధం చైనాకు ఎదురుగా పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉంది.లీసా కర్టిస్‌ సూచించినట్లు,ఈ విషయంలో భారత్‌-అమెరికా మధ్య మరింత సహకారం బలపడే అవకాశాలున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డొనాల్డ్ ట్రంప్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    డొనాల్డ్ ట్రంప్

    Trump Florida shooting: డొనాల్డ్‌ ట్రంప్‌ హత్యాయత్నం కేసులో కీలక ఆధారాలు.. నెల ముందు నుంచే స్కెచ్‌!  అమెరికా
    Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ సభకు ఎలాన్‌ మస్క్‌ హాజరు.. రాజకీయ వేదికపై కొత్త ఉత్సాహం ఎలాన్ మస్క్
    Trump-Putin: రష్యా అధ్యక్షుడితో డోనాల్డ్ ట్రంప్ సీక్రెట్‌ ఫోన్‌ కాల్స్‌..! వ్లాదిమిర్ పుతిన్
    Donald Trump: అమెరికా ఉత్పత్తులపై భారత్‌ అత్యధిక పన్నులు.. . మరోసారి సుంకాల ప్రస్తావన తెచ్చిన ట్రంప్‌ అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025