Page Loader
Boat Capsize:శాన్ డియాగో బీచ్‌లో పడవ బోల్తా.. ముగ్గురు మృతి,ఇద్దరు భారతీయ చిన్నారులు మిస్సింగ్ 
శాన్ డియాగో బీచ్‌లో పడవ బోల్తా.. ముగ్గురు మృతి,ఇద్దరు భారతీయ చిన్నారులు మిస్సింగ్

Boat Capsize:శాన్ డియాగో బీచ్‌లో పడవ బోల్తా.. ముగ్గురు మృతి,ఇద్దరు భారతీయ చిన్నారులు మిస్సింగ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2025
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో శాన్ డియాగో నగరానికి సమీపంగా ఉన్న పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో శరణార్థులు ప్రయాణిస్తున్న ఓ బోటు బోల్తా పడిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గల్లంతైనట్టు సమాచారం. ఆ గల్లంతైన వారిలో ఇద్దరు భారతీయ చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ డియాగోకు సుమారు 15 మైళ్ల దూరంలో ఈ బోటు మొత్తం 16 మందితో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

వివరాలు 

బోటులో అక్రమంగా మనుషుల రవాణా

ఈ ఘటనపై శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత దౌత్య కార్యాలయం స్పందించింది. ఈ విషాద ఘటనలో భారతీయ కుటుంబం కూడా ఉన్నట్టు వారు తెలిపారు. భారతీయ మూలాలు ఉన్న ఇద్దరు చిన్నారులు ఇప్పటికీ గల్లంతైన్నట్టు గుర్తించినట్టు చెప్పారు. అయితే, ఆ పిల్లల తల్లిదండ్రులు ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. భారతీయ కుటుంబానికి అన్ని విధాలా సహాయాన్ని అందిస్తున్నామని, ఇందుకు సంబంధించి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని భారత కాన్సులేట్ వెల్లడించింది. ఈ బోటులో అక్రమంగా మనుషులను రవాణా చేస్తున్నట్టు కోస్టుగార్డ్ అధికారులు పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత దౌత్య కార్యాలయం చేసిన ట్వీట్