Page Loader
United Nations: హెజ్‌బొల్లా దాడులపై యూఎన్‌ తీవ్ర ఆగ్రహం
హెజ్‌బొల్లా దాడులపై యూఎన్‌ తీవ్ర ఆగ్రహం

United Nations: హెజ్‌బొల్లా దాడులపై యూఎన్‌ తీవ్ర ఆగ్రహం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2024
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ తాజా దాడులు, హెజ్‌బొల్లా లక్ష్యంగా జరిగిన ఘటనలు అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవలి కాలంలో పాలస్తీనాలోని హమాస్‌పై దృష్టిసారించిన ఇజ్రాయెల్‌, ఇప్పుడు లెబనాన్‌లోని హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకోవడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు చోటుచేసుకోవడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇజ్రాయెల్‌ దాడులను ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని, యుద్ధ నేరాలుగా పరిగణించవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో యూఎన్‌ అత్యవసర సమావేశం నిర్వహించి, పలువురు ప్రపంచ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Details

దాడులపై స్పందించేందుకు నిరాకరించిన ఇజ్రాయెల్

పోర్టబుల్‌ కమ్యూనికేషన్‌ పరికరాల్లో ట్రాప్‌ ఉపకరణాలను ఉపయోగించడం పూర్తిగా సరికాదని, ఉద్దేశపూర్వక హింసగా పరిగణించవచ్చని యూఎన్‌ మానవహక్కుల హైకమిషనర్‌ వోల్కర్‌ టర్క్‌ చెప్పారు. ఇలాంటి దాడులు సాధారణ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని, ఇది యుద్ధం మరింత ఉద్రిక్తతలను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఇక, ఇజ్రాయెల్‌ ఈ దాడులపై స్పందించేందుకు నిరాకరించింది. యూఎన్‌ సహా ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇజ్రాయెల్‌ చర్యలను నిలదీశాయి.