
Trump: టారిఫ్లపై అమెరికా కోర్టు స్టే.. విచారణలో భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రస్తావన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరోసారి న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలింది.
ఆయన ఏప్రిల్ 2న ప్రకటించిన "లిబరేషన్ డే" ప్రతీకగా విధించిన టారిఫ్లపై బుధవారం అమెరికా ట్రేడ్ కోర్టు స్టే విధించింది.
అమెరికా తరపున ఎక్కువ మొత్తంలో వస్తువులు విక్రయిస్తున్నప్పటికీ, అమెరికా మాత్రం వాటి నుంచి తక్కువగా కొనుగోలు చేస్తోందని పేర్కొంటూ ట్రంప్ ఈ టారిఫ్లను విధించారు.
అయితే ఈ విషయంలో అధ్యక్షాధికారాలు మించి వ్యవహరించారని కోర్టు అభిప్రాయపడింది.
అంతర్జాతీయ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (IEEPA) ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా టారిఫ్లు విధించే అధికారం తనకు ఉందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, కోర్టు ఈ వాదనను అంగీకరించలేదు.
వివరాలు
టారిఫ్లు - భారత్-పాకిస్థాన్ ఘర్షణలపై ప్రభావం?
అంతేకాదు, ఈ టారిఫ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయని, తాజాగా భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గిన విషయాన్ని ట్రంప్ ప్రభుత్వం ప్రస్తావించినా, కోర్టు దానిని పరిగణనలోకి తీసుకోలేదు.
IEEPA చట్టం ప్రకారం తీసుకొచ్చిన టారిఫ్లు భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాయని ట్రంప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం,అణ్వాయుధ శక్తులైన ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి తారాస్థాయికి చేరిందని పేర్కొన్నారు.
అప్పట్లో ట్రంప్ మధ్యవర్తిత్వం చేసి,టారిఫ్ల ప్రోత్సాహంతో కాల్పుల విరమణ జరగిందని వారు పేర్కొన్నారు.
అలాగే జూలై 7 నాటికి అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన దశలో ఈ వ్యవహారం "సున్నిత స్థితిలో"ఉందని కూడా ప్రభుత్వ ప్రతినిధులు కోర్టులో తెలిపారు.
వివరాలు
కోర్టు తీర్పు ఏమిటి?
న్యూయార్క్లోని మన్హట్టన్కు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించింది.
IEEPA చట్టం ప్రకారం అధ్యక్షుడికి పరిమితులు లేని అధికారాలు ఇవ్వలేమని వారు స్పష్టం చేశారు.
జాతీయ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే,అది కూడా అసాధారణ ముప్పులను ఎదుర్కొనే సందర్భంలో మాత్రమే అధ్యక్షుడు ఆర్థిక ఆంక్షలు విధించగలరని తీర్పు వెల్లడించింది.
అమెరికా రాజ్యాంగం ప్రకారం అంతర్జాతీయ వాణిజ్య నియంత్రణ అధికారం కేవలం కాంగ్రెస్కే ఉందని కోర్టు స్పష్టం చేసింది.
"అధ్యక్షుడికి టారిఫ్లు విధించే అధికారం ఉందా లేదా అనే అంశంపై కోర్టు నిర్ణయించదు, కానీ చట్టం ప్రకారం అది అనుమతించదని మాత్రమే చెప్పగలదు" అని ధర్మాసనం పేర్కొంది.
ట్రంప్ అధికారం దాటి టారిఫ్లు విధించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని కూడా పేర్కొంది.
వివరాలు
ట్రంప్ యంత్రాంగం స్పందన
ఈ తీర్పు వచ్చిన వెంటనే ట్రంప్ ప్రభుత్వం అప్పీల్కు సిద్ధమైంది.
కోర్టు తీర్పు విదేశీ దేశాలపై అమెరికా విధించే టారిఫ్ శక్తిని తగ్గించడమేనని, దీనివల్ల వ్యూహాత్మకంగా ఆర్థిక పరంగా తీసుకునే చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని ట్రంప్ యంత్రాంగం పేర్కొంది.
అంతర్జాతీయంగా అమెరికా ప్రయోజనాలకు ఇది నష్టం అవుతుందని తెలిపింది. ఏప్రిల్ 2న ట్రంప్ అమెరికా ప్రధాన వాణిజ్య భాగస్వాములపై టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే.
మొదటిగా 10% టారిఫ్ విధించి, ప్రధానంగా చైనా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలపై ఎక్కువ మొత్తంలో సుంకాలు విధించడాన్ని ప్రకటించారు.
అయితే, అమెరికా ఆర్థిక మార్కెట్లపై దీని ప్రభావం తీవ్రంగా పడటంతో, కొన్నిరోజులకు కొన్ని దేశాలపై టారిఫ్లు తాత్కాలికంగా ఉపసంహరించారు.
వివరాలు
టారిఫ్లపై కోర్టులో కేసులు
మే 12న చైనా మీద విధించిన భారీ టారిఫ్లను తాత్కాలికంగా తగ్గించినట్టు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది.
రెండు దేశాలు పరస్పరం 90 రోజులు టారిఫ్లను తగ్గించుకోవాలని అంగీకరించాయి.
భారత్తో జూలై 8వ తేదీలోపు వాణిజ్య ఒప్పందానికి గడువు విధించిన విషయాన్ని కూడా ట్రంప్ ప్రభుత్వం తెలియజేసింది.
ఈ తీర్పు రెండు ప్రధాన పిటిషన్లపై వెలువడింది.ఒక పిటిషన్ లిబర్టీ జస్టిస్ సెంటర్ అనే స్వతంత్ర సంస్థ తరఫున ఐదు చిన్న వ్యాపార సంస్థలు దాఖలు చేసినవి.
వివరాలు
టారిఫ్లపై కోర్టులో కేసులు
మరొక పిటిషన్ అమెరికాలోని 13 రాష్ట్రాల తరఫున వేశారు. ఇంకా కనీసం ఐదు టారిఫ్ కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.
వైట్హౌస్ గానీ, పిటిషనర్ల తరఫున న్యాయవాదులు గానీ స్పందించలేదు.
అయితే, ట్రంప్ రాజకీయ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ మాత్రం సోషల్ మీడియాలో స్పందిస్తూ, "ఈ న్యాయ విప్లవం హద్దులు దాటి పోతుంది" అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.