Page Loader
Netanyahu: లక్ష్యానికి చేరువ అయ్యాం.. ఇరాన్‌తో సుదీర్ఘ యుద్ధం ఉండదు : ఇజ్రాయెల్ ప్రధాని
లక్ష్యానికి చేరువ అయ్యాం.. ఇరాన్ సుదీర్ఘ యుద్ధం ఉండదు : ఇజ్రాయెల్ ప్రధాని

Netanyahu: లక్ష్యానికి చేరువ అయ్యాం.. ఇరాన్‌తో సుదీర్ఘ యుద్ధం ఉండదు : ఇజ్రాయెల్ ప్రధాని

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రగులుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. టెహ్రాన్‌తో సుదీర్ఘ యుద్ధం జరపమని తెలిపారు. 'ఆపరేషన్ రైజింగ్ లయన్‌' పేరుతో చేపట్టిన దాడుల్లో లక్ష్యానికి చేరువవుతున్నట్లు వెల్లడించారు. ఇరాన్‌పై అమెరికా బాంబుదాడులు జరిపిన అనంతరం నెతన్యాహు మీడియాతో మాట్లాడారు. ''టెహ్రాన్‌లోని ఫోర్డో అణుకేంద్రాన్ని అమెరికా తీవ్రంగా ధ్వంసం చేసింది. దీని ద్వారా ఇరాన్‌ అణ్వాయుధ కార్యక్రమాన్ని వెనక్కి నెట్టగలిగాం. ముప్పును తొలగించుకున్నాం. లక్ష్యాలను చేరుకోవడమే మా ఉద్దేశం. అవసరానికి మించి మా చర్యలను కొనసాగించమని చెప్పారు.

Details

లక్ష్యానికి దగ్గర అవుతున్నాం

లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే ఆపరేషన్‌ ముగిసినట్లే. యుద్ధం కూడా ఆగుతుంది. ప్రస్తుత ఇరాన్‌ పాలకులు మమ్మల్ని తుడిచిపెట్టాలని చూశారు. అందుకే ఈ ఆపరేషన్‌ చేపట్టాల్సి వచ్చింది. మాకు ప్రధానంగా రెండు ముప్పులను తొలగించడం అవసరం. ఒకటి అణ్వాయుధాలు, రెండు బాలిస్టిక్‌ క్షిపణులు. ఈ లక్ష్యాల దిశగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు వాటిని చేరువయ్యాము. టెహ్రాన్‌తో సుదీర్ఘ యుద్ధం జరపమని నెతన్యాహు వెల్లడించారు. అయితే అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

Details

 'ఇజ్రాయెల్‌ ఘోర తప్పిదం చేసింది' - ఖమేనీ 

ఇజ్రాయెల్‌ కు మద్దతుగా ఇరాన్‌ అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా క్షిపణులు, బాంబర్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. 'యూదు శత్రువులు ఘోర తప్పిదం చేశారు. తీవ్ర నేరానికి పాల్పడ్డారు. దీనికి శిక్ష తప్పదు. తక్షణమే శిక్షించాల్సిన అవసరం ఉందని ఖమేనీ ఒక పోస్ట్‌ ద్వారా హెచ్చరించారు. అయితే ఇందులో ఆయన అమెరికా ప్రస్తావన చేయకపోవడం గమనార్హం. అమెరికా దాడులను ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ ఖండించారు. 'ఈ దాడులకు అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. దాడుల అనంతరం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన పెజెష్కియాన్‌, 'అమెరికాకు దీటుగా బదులిస్తామని ప్రకటించారు.

Details

దౌత్యాన్ని నాశనం చేయాలని అమెరికా కంకణం

ఇక పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇందులో ఐరాన్‌ రాయబారి అమీర్‌ సయీద్‌ ఇరవానీ మాట్లాడుతూ, ''అమెరికా విదేశాంగ విధానాన్ని హైజాక్‌ చేసి నెతన్యాహును ఈ యుద్ధంలోకి లాగింది. అమెరికా చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోనుంది. దౌత్యాన్ని నాశనం చేయడానికి అమెరికా కంకణం కట్టుకుంది. దీనికి సరైన సమయంలో మేమే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు.