
operation sindoor: పుల్వామాలో వ్యూహం మేమే అమలు చేసాం : పాక్ వాయుసేనాధికారి
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఘోర బాంబుదాడికి పాక్ సంబంధం ఉందని ఎట్టకేలకు ఆ దేశమే అంగీకరించింది.
ఈ దాడిలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి, పాకిస్తాన్ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ తాజా ప్రెస్మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో పాక్ డీజీఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదురి, నౌకాదళ ప్రతినిధి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఔరంగజేబ్ అన్నారు.
మా దేశ గగనతలాన్ని, భూభాగాన్ని లేదా ప్రజలను ఎవరు ముప్పుగా చూస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయబోమని, దేశ ప్రజల గౌరవం రక్షించడంలో మేము రాజీపడేది లేదని పేర్కొన్నారు.
Details
అబద్ధాలని తేలిపోయాయి
అంతేకాదు, పుల్వామాలో మేం చూపిన వ్యూహం, కార్యదక్షత అద్భుతంగా నిలిచింది.
మేము తగిన సమయంలో మా సమర్థతను ఇప్పటికే నిరూపించామని వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలతో పాక్ ఇంతకాలం తమను ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధం లేదంటూ చేసిన ప్రకటనలు ఖండితంగా అబద్ధంగా తేలిపోయాయి.
పుల్వామా దాడికి తమ హస్తం లేదన్న ఇస్లామాబాద్ అధికారిక వర్గాల వాదనలు ఇప్పుడు ఎయిర్ వైస్ మార్షల్ మాటలతో పటాపంచలయ్యాయి.
ఇంతకాలంగా పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎత్తిచూపిన సంగతి తెలిసిందే.
తాజాగా పహల్గాం దాడిపై కూడా అదే తరహాలో పాకిస్తాన్ నేతృత్వం స్పందించడాన్ని గమనించాల్సిన విషయం.