Page Loader
Yogi Adityanath: నేపాల్‌లో రాచరిక అనుకూల ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఫోటో  ఎందుకు వివాదాస్పదమైంది..?
నేపాల్‌లో రాచరిక అనుకూల ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఫోటో ఎందుకు వివాదాస్పదమైంది..?

Yogi Adityanath: నేపాల్‌లో రాచరిక అనుకూల ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఫోటో  ఎందుకు వివాదాస్పదమైంది..?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2025
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పై తీవ్ర చర్చ జరుగుతోంది. దేశ రాజధాని ఖాట్మండులో వేలాది మంది వీధుల్లోకి వచ్చి, యోగి ఆదిత్యనాథ్‌ ప్లెక్సీలు ఉన్న పోస్టర్లను ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హిందూత్వానికి అనుకూలమైన మాజీ రాజు జ్ఞానేంద్ర షా (Raja Gyanendra Shah) తిరిగి రావడంతో, నేపాల్‌ను మళ్లీ హిందూ దేశంగా మార్చాలని డిమాండ్ పెరుగుతోంది. మద్దతుదారులు రాజా జ్ఞానేంద్ర షా చిత్రాలతో పాటు యోగి ఆదిత్యనాథ్‌ ఫొటోలు ఉన్న జెండాలను ఎగురవేస్తూ నినాదాలు చేశారు.

వివరాలు 

నేపాల్ ప్రధాని విమర్శలు 

గత జనవరిలో రాజా జ్ఞానేంద్ర షా ఉత్తర్‌ప్రదేశ్‌ను సందర్శించారు. మీడియా నివేదికల ప్రకారం, ఆ సందర్శన సమయంలో ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఇప్పుడా యువత యోగి చిత్రాలతో పాటు రాజా జ్ఞానేంద్ర షా చిత్రాలు, నేపాల్ జాతీయ జెండాలను పట్టుకుని మోటార్ సైకిళ్లపై ప్రదర్శన చేశారు. అయితే, ఈ ర్యాలీల్లో యోగి ఫోటోలను ఉపయోగించడంపై నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి (KP Sharma Oli) విమర్శించారు.

వివరాలు 

నేపాల్‌లో రాజకీయ మార్పులు: 

ఉత్తర్‌ప్రదేశ్‌ సరిహద్దుకు ఆనుకుని ఉన్న నేపాల్‌లో రాజకీయ పరిస్థితులు కొన్నేళ్లుగా మారుతున్నాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు హిందూ సనాతన ధర్మానికి మద్దతు ఇస్తున్నారు. 2006లో చైనా అనుకూల మావోయిస్టు ఉద్యమం రాజు జ్ఞానేంద్ర పాలనను ముగించిందని నమ్ముతారు. ఆ తర్వాత వామపక్ష ప్రభుత్వం ఏర్పడింది. పుష్ప కమల్ దహల్ ప్రచండ అనంతరం, కె.పి. శర్మ ఓలి బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఇప్పుడు మళ్లీ హిందూ రాజ్యం (Hindu Rashtra) ఏర్పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

ర్యాలీల్లో జెండాలను ఊపుతూ ప్రదర్శనలు 

రాజా జ్ఞానేంద్ర షా గత కొన్ని సంవత్సరాలుగా నేపాల్‌ను మళ్లీ హిందూ దేశంగా మార్చాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పోఖారా నుంచి ఖాట్మండుకు చేరుకున్న తర్వాత, త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మద్దతుదారులు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ర్యాలీలో కొన్ని కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు యువకులు రాజా జ్ఞానేంద్ర షా చిత్రాలతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లను ఊపుతూ నినాదాలు చేశారు.