
PM Modi: ప్రధాని మోదీకి యూనస్ లేఖ.. అందులో ఏముందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఈద్-ఉల్-అధా పండుగను పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్కు శుభాకాంక్షలతో కూడిన లేఖను పంపించారు.
ఈ లేఖకు స్పందనగా ముహమ్మద్ యూనస్ కూడా మరో లేఖను ప్రధాని మోదీకి రాశారు. ఈ లేఖను యూనస్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫాం 'ఎక్స్'లో షేర్ చేశారు.
లేఖలో యూనస్ పేర్కొన్న ప్రకారం, భారత్-బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం, అవగాహన కీలకమైన అంశాలు అని స్పష్టంగా తెలిపారు.
ఈ రెండు అంశాలే ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే మార్గదర్శక శక్తులని అభివర్ణించారు. మోదీ సందేశం ఆలోచనాత్మకంగా ఉండి, ఇరు దేశాల మధ్య ఉన్న మానవీయ విలువలను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.
Details
పరస్పర సహకారంతో ముందుకెళ్లాలి
యూనస్ లేఖలో, ఈద్ పండుగ పేర్కొనేది త్యాగం, దాతృత్వం, ఐక్యత వంటి విలువల ప్రాముఖ్యతను, ప్రజలంతా ఒకచోట చేరి మానవత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తుందని వ్యాఖ్యానించారు.
అంతేకాక, ఈ పండుగ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు.
ఇదకు ముందు ప్రధాని మోదీ రాసిన లేఖలో, భారత దేశం సాంస్కృతికంగా సమృద్ధిగా ఎదగడం దాని వైవిధ్యభరిత వారసత్వం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు.
త్యాగం, కరుణ, సోదరభావం వంటి విలువలు శాంతియుత సమాజ నిర్మాణానికి బలమైన పునాది అని తెలిపారు.
అలాగే, ఈ విలువలు మాత్రమే సమ్మిళిత ప్రపంచం వైపు మనను నడిపిస్తాయని ప్రధాని మోదీ లేఖలో తెలిపారు.