NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Tata Motors: టాటా సంస్థ షాకింగ్ ప్రకటన.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న వాహనాల ధరలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Tata Motors: టాటా సంస్థ షాకింగ్ ప్రకటన.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న వాహనాల ధరలు 
    టాటా సంస్థ షాకింగ్ ప్రకటన.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న వాహనాల ధరలు

    Tata Motors: టాటా సంస్థ షాకింగ్ ప్రకటన.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న వాహనాల ధరలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 18, 2025
    12:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మరోసారి ప్రఖ్యాత కార్లతయారీ కంపెనీలు ధరల పెంపుపై ఒకదాని తర్వాత ఒకటి ప్రకటనలు చేస్తున్నాయి.

    ఇప్పటికే భారతీయ ఆటో మొబైల్ రంగంలో అగ్రగామి అయిన మారుతీ సుజుకీ,వాహన ప్రియులకు షాక్ ఇచ్చింది.

    ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు స్పష్టం చేసింది.

    మారుతీ ప్రత్యర్థిగా ఉన్న,దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ కూడా అదే మార్గాన్ని అనుసరించింది.

    ఈసంస్థ తన వాణిజ్య వాహనాల ధరలను సుమారు 2శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది.

    కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది.

    ఆటోమోటివ్ పరిశ్రమపై ప్రభావం చూపుతున్న పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను సమతుల్యం చేయడానికే ఈధరల పెంపు అవసరమని కంపెనీ స్పష్టం చేసింది.

    వివరాలు 

    మోడల్, వేరియంట్‌లపై ఆధారపడి ధరల మార్పు 

    "భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థగా ఉన్న టాటా మోటార్స్,ఈ రోజు తన వాణిజ్య వాహనాల శ్రేణిలో 2 శాతం వరకూ ధరల పెంపును ప్రకటించింది.

    ఈ పెంపు ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది" అని కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

    మోడల్, వేరియంట్‌లపై ఆధారపడి ఈ ధరల మార్పు ఉంటుందని టాటా మోటార్స్ పేర్కొంది. గత కొన్ని నెలలుగా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ పెరుగుతున్న ముడి పదార్థాల ఖర్చులు, అధిక లాజిస్టిక్స్ వ్యయాలు, సరఫరా గొలుసులో ఏర్పడుతున్న అంతరాయాల వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది.

    ఈ నేపథ్యంలో, ధరల పెంపు అనివార్యమవుతోంది. ఖర్చులను నియంత్రించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ, పెరిగిన ఖర్చులలో కొంతభాగాన్ని వినియోగదారులపై మోపాల్సిన పరిస్థితి తయారైంది.

    వివరాలు 

     వాహనాల ధరలను 4 శాతం వరకూ పెంచనున్న  మారుతీ సుజుకీ 

    ఈ పరిణామాల్లో భాగంగా, మొదటగా మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ 2025 ఏప్రిల్ నుంచి వాహనాల ధరలను 4 శాతం వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది.

    దీనికి ప్రధాన కారణంగా పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు, కార్యాచరణ వ్యయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పేర్కొంది.

    మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌ నిర్ణయాల తర్వాత, ఇతర కార్ల తయారీ సంస్థలు కూడా వాహనాల ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చు.

    టాటా గ్రూప్‌లో భాగమైన టాటా మోటార్స్, కార్లు, యుటిలిటీ వాహనాలు, పికప్ ట్రక్కులు, బస్సుల తయారీలో ప్రముఖ స్థానం పొందింది. మార్చి 17న టాటా మోటార్స్ షేర్‌ ధర 0.70 శాతం పెరిగి రూ. 660.10 వద్ద స్థిరపడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాటా మోటార్స్

    తాజా

    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా
    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! భారతదేశం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్

    టాటా మోటార్స్

    Tata Nexon.ev: టాటా నెక్సాన్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే? ఆటో మొబైల్
    టాటా నెక్సాన్‌ ఫీచర్లలో తగ్గేదేలే.. స్టన్నింగ్ లుక్స్‌తో ముందుకొస్తున్న కొత్త నెక్సాన్‌ ఈవీ టాటా
    2023 టాటా నెక్సాన్ vs హ్యుందాయ్ వెన్యూ.. బెస్ట్ ఫీచర్స్ ఎందులో ఉన్నాయంటే! హ్యుందాయ్
    స్పోర్ట్స్ లుక్ ఇస్తున్న TATA Curvv Suv ఈవీ.. లాంచ్,ధరల వివరాలు తెలుసా  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025